షాబాద్ ప్లాట్ల ఇ-వేలం.. డిజప్పాయింట్ చేశాయిగా
హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్, మోకిలల్లో హెచ్ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

