చంద్రబాబు ప్రాణాలకు లోకేష్ నుండే ప్రమాదం: షాకింగ్ విషయం చెప్పిన వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో టిడిపి నేతలు, నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతిచెందడంతో, చంద్రబాబు ఆరోగ్యంపై కూడా టిడిపి శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, జైల్లోనే చంద్రబాబును…

