National

National

మోదీ-జిన్‌పింగ్ భేటీ.. సరిహద్దు వివాదంపై చర్చలు..

భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాంజిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం భేటీ కానున్నారు. పది నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.   గతంలో 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన…

National

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్..

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.   భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ…

National

నెహ్రూ కలలుగన్న శాంతి ఒప్పందం.. భారత్-చైనా సంబంధాల్లో కీలక అధ్యాయం..

భారత్-చైనా సంబంధాల గురించి చర్ల వచ్చినప్పుడల్లా ‘పంచశీల ఒప్పందం’ ప్రస్తావనకు వస్తుంది. ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ నినాదాలతో స్నేహానికి ప్రతీకగా మొదలైన ఈ ఒప్పందం, చివరికి రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయడం ఒక చారిత్రక విషాదం. సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం వెనుక ఎన్నో ఆశలు, రాజీలు, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉన్నాయి.   చైనాలో నెహ్రూ చారిత్రక పర్యటన 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో…

National

ముంబయిలో రిలయన్స్ రెండు భారీ ప్రాజెక్టులు..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ రెండు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ముంబై నగరంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ప్రణాళికలను ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 2,000 పడకల మెడికల్ సిటీని, నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేలా 130 ఎకరాల కోస్టల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.   రిలయన్స్ లాభాపేక్ష రహిత విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్…

National

ట్రంప్ వల్ల అమెరికా పరువు పోతోంది..! యూఎస్ మాజీ అధికారులు ఫైర్..

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన భారత్‌ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్‌హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   ఇటీవల ‘ది బల్వార్క్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సలివాన్, ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా…

National

మోదీతో జెలెన్‌స్కీ టెలిఫోన్ సంభాషణ… పుతిన్ తో భేటీకి ముందు కీలక విన్నపం..

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యాకు గట్టి సంకేతాలు పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇరువురు నేతలు ఫోన్‌లో సంభాషించారు. నెల రోజుల వ్యవధిలో మోదీ, జెలెన్‌స్కీ మాట్లాడుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.   ఈ సంభాషణ సందర్భంగా, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులు,…

NationalTechnology

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’.. హైదరాబాద్ నుంచీ వీక్షించే అవకాశం..

ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.…

National

చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం..

భారత్, చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణల అనంతరం, ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక భేటీ ఆదివారం జరగనుంది.   జపాన్ లో త‌న‌ రెండు రోజుల పర్యటన ముగించుకుని…

National

కర్ణాటకలో వింత.. నీలం రంగు గుడ్డు పెట్టిన నాటు కోడి..!

కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.   వివరాల్లోకి వెళితే.. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు.…

National

ఆధార్ తో ధ్రువీకరణ… ఒప్పందం కుదుర్చుకున్న స్టార్‌లింక్..!

భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)తో స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకుంది.   ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ సంస్థ ఆధార్ ఆధారిత డిజిటల్ ధ్రువీకరణ (ఈకేవైసీ) విధానాన్ని ఉపయోగించనుంది. భారత్‌లో ఎక్కువ మంది పౌరుల వద్ద ఇప్పటికే ఆధార్…