విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి..!
భారత వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన మైలురాయి నమోదైంది. విత్తన నాణ్యతను మెరుగుపరిచి, పంట దిగుబడిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ‘స్మార్ట్ సీడ్ కోటింగ్’ సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవిష్కరించింది. ఈ బయోపాలిమర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో 30 శాతం వరకు అదనపు దిగుబడి సాధించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఈ నూతన విధానాన్ని…

