National

National

ఒక్క ఎముకతో డైనోసార్ల చరిత్ర రహస్యం..! ఎలా బయటపడిందంటే..!

ఈరోజు డైనోసార్ల గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారీ శిలాజాలు దొరికినా అవి ఏ జీవికి చెందినవో శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటి ఆసక్తికర సంఘటనే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో జరిగింది. తర్వాత అదే శిలాజం చరిత్రలో నమోదైన తొలి డైనోసార్‌ ఆనవాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.   1676లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సున్నపురాయి గనిలో కార్మికులు భారీ కాలి ఎముకను వెలికితీశారు. ఈ శిలాజాన్ని ప్రకృతి శాస్త్రవేత్త…

National

భారత్‌కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం..!

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా… 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక హెచ్చరించింది. అయితే, ఈ సంక్షోభమే రాబోయే దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేయనుందని పీఎల్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జల శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్), మురుగునీటి రీసైక్లింగ్, మురుగునీటి పారుదల…

National

పాత వాహనాలకు ఈ20 ప్రమాదమా..? సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పింది..?

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (ఈ20) కలిపే కార్యక్రమంపై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విధానం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చే ఏడాదికి స్పష్టమైన ఫలితాలు అందుతాయని వెల్లడించింది. పాత వాహనాలపై ఈ20 పెట్రోల్‌ ప్రభావం చూపుతుందన్న చర్చలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఈ20 ఇథనాల్‌ సరఫరాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఈ విషయాన్ని…

National

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్‌తో కలుస్తామని హెచ్చరిక..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.   ఈ ఆందోళనలో పాల్గొన్న పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ఆహారం,…

National

భారత్‌లో నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం..! రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్

అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్‌లో భారీగా విస్తరించిన నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెర్సాచీ, మైఖేల్ కోర్స్, జిమ్మీ చూ వంటి ప్రఖ్యాత కంపెనీలు నకిలీ సరుకును అరికట్టేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్లను నియమించుకుంటున్నాయి. వీరు సాధారణ కస్టమర్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్లి, నకిలీ వస్తువులను విక్రయించే వారి సమాచారాన్ని సేకరించి కంపెనీలకు అందిస్తున్నారు.   ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు…

National

అయోధ్య చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు..

అయోధ్యలోని ప్రసిద్ధ శ్రీరామ జన్మభూమి దేవాలయ కానుకల చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి దాదాపు రూ. 58 లక్షల నగదును రికవరీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును…

National

స్టాలిన్‌కు షాకిచ్చిన వైకో.. ఆయనకు ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య నేతలు, జిల్లా కార్యదర్శులు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆదివారం డీఎంకే గూటికి చేరారు.   చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సమక్షంలో వీరంతా…

National

రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా..

రవాణా రంగంలో సహకార స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించబోతోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దేశంలోని 500కు పైగా నగరాలు, పట్టణాల్లో ఈ సహకార మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేడు గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు.   గుజరాత్‌లోని అన్ని ప్రధాన…

National

అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే..

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారంటూ కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే తప్పుబట్టారు. ఈ అంశంపై ప్రధాని తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్పష్టత ఇవ్వాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా చేయడంతో ఈ వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.  …

National

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్: పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నిందితులు!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.   రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్…