పీఎం మోడీని పొగిడి.. వారికి 10కోట్ల విరాళం: మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒడిశాలోని బాలాసోర్ లో తాజాగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 10 కోట్ల రూపాయలను విరాళంగా పంపించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ చెక్కును పంపించారు. తాను…

