జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ-పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలోకి..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించాల్సిన కీలక బిల్లులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కేంద్రం.. ఈ నెల 20న సమావేశాల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. పార్లమెంటు పాత భవనంలోనే ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలు మధ్యలో కొత్త భవనానికి మారబోతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల…
బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్
బెంగళూరు/బాదామి: బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కర్ణాటక నార్త్ జోన్ ఐజీపీ వికాసకుమార్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. దీనికి తోడు భారీ పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటకలోని బాదామి తాలూకా పట్టణానికి చెందిన బాదామి తాలూకకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ నబీసాబ హులికేరి, అఖ్తాబ్ నబీసాబ హులికేరి, మహ్మద్ జామీ హుసేనసాబ…
దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం
దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC)కు గౌరవ చైర్మన్గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి క్రికెటర్లుగా ఎదగాలనుకునేవారిని ఈ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తుంది. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్ లో ఐఎస్ బీసీ ఏర్పాటైంది. తాను కూడా క్రికెట్ ఆడేవాడినని, ఆ ఆటంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్కూల్ టైంలో తమ ఊర్లో క్రికెట్ ఆడేవాడినని రాజమౌళి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన…
ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !
బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు…
“వ్యూహం” పై ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ – బట్టలూడదీసి కొడతాం, ఖబడ్దార్..!!
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. అందులో వైఎస్సార్ మరణం సమయం నుంచి రాజకీయంగా జగన్ చేసిన రాజకీయ పోరాటం హైలైట్ చేసారు. కాంగ్రెస్ తీరు..కేసులు…సీబీఐ విచారణ..ఓదార్పు యాత్ర అన్నీ కంటికి కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసి నట్లుగా స్పష్టం అవుతోంది. దీని పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. వ్యూహం…
మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్: కేసీఆర్ రెండ్రోజుల పర్యటన, కీలక నేతల చేరిక
హైదరాబాద్: మహారాష్ట్రపై భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపట్నుంచి(జూన్ 26) రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం షోలాపూర్లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్ను గెంటేసిన మహిళా ప్రయాణికులు
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా…
యూపీలో మరో దారుణ ఘటన-వాంగ్మూలం ఇస్తుందని దళిత మైనర్ రేప్ బాధితురాలికి ఉరి
ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాబంకిలోని హైదర్ ఘర్ లో నివసిస్తున్న ఓ దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆమెను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఆ లోపే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారాబంకిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తీవ్ర విమర్శలు…
కరెంట్ చార్జీలు గతంలోని ప్రభుత్వం పెంచింది, మాకు ఏమి సంబంధం. మంత్రి మాటలతో!
బెంగళూరు: మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే బీజేపీ విద్యుత్ చార్జీలు పెంచిందని, అలాగే విద్యుత్ చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని, విద్యుత్ ఛార్జీలను పెంచింది మేము కాదని, కరెంటు చార్జీల ధరలు పెంపు నిర్ణయం ఉపసంహరించుకోలేమని కర్ణాటక మంత్రి ఎంబీ .పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి ఎంబీ. పాటిల్ మీడియాతో మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి కలిగిన కేఇఆర్ సీ ఈ విద్యుత్…

