65 స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనదే సర్కార్ అంటున్న కేసీఆర్..
65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్రకు చెందిన కొంత మంది సర్పంచ్, ఉప సర్పుంచులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదన్నారు. తెలంగాణలో…

