వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధికి గుండెపోటు- హెల్త్ అప్ డేట్ ఇదే.
కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి ఇవాళ గుండెపోటుకు గురయ్యారు. ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు ఆయన ప్రాణం కాపాడారు. అనంతరం యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించి స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. స్టెంట్ వేసిన తర్వాత పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊరట పొందారు. అంతకుముందు స్ధానికంగా…

