మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.
మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్చాంద్పూర్లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు…

