National

National

గుడ్లు,పాలు కలిపి తీసుకుంటే లాభాలతో పాటు నష్టాలు కూడా?

సాధారణంగా చాలామంది గుడ్లు పాలు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే చాలా మంచిదని శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పచ్చి గుడ్డు పాలు తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టిన గుడ్డు పాలు తీసుకుంటూ ఉంటారు. గుడ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే పాల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, పచ్చి గుడ్లు, పచ్చి పాలు ఈ రెండు అధిక…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…

CINEMANational

రజినీకాంత్ కితాబు, అమెరికా ఇంజినీర్ల ప్రశంసలు: తెలంగాణ నెంబర్ 1 అంటూ కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. తెలంగాణలో సమగ్ర, సమత్యులత,సమ్మిళిత అభివృద్ధి జరిగిందని వివరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.   పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు…

National

భలే షాకిచ్చిన సిద్ధరామయ్య: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు- ఉచితాల భారం జనంపైనే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు అతి కీలకమైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం.. వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి కర్ణాటక…

NationalTELANGANA

వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం…

CINEMANational

ఆగిపోయిన బాలయ్య – బోయపాటి సినిమా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తోందంటూ కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్ చల్ చేస్తోంది. ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో సినిమా తీసి విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ సినిమాకు పార్ట్-2 అనుకున్నారు. హిట్ కాంబినేషన్ కావడంతో నిర్మాతలు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయడానికి పోటీపడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా తీస్తే…

National

చంద్రబాబుకు తాత్కాలిక ఊరట ! లింగమనేని ఇంటి జప్తుపై తేల్చని ఏసీబీ కోర్టు ?

ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఇల్లు అటాచ్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ప్రకటిస్తుందని ఆశించినా కోర్టు మాత్రం మళ్లీ వాయిదా వేసింది. చంద్రబాబు…

National

షాకింగ్ వీడియో: మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి మృతి

హైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలా మంది లిక్కర్ సేవించకుండా ఉండలేరు. పరిమితికి మించి తాగితే ఎన్నో అనర్థాలు తప్పవని తెలిసినా.. మద్యానికి బానిసగా మారి తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న భూక్యా అశోక్..…

CINEMANational

మొదటి స్థానంలో ప్రభాస్.!. రెండో స్థానంలో చినజీయరు!!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి ఆదిపురుష్ పైనే ఉంది. సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ప్రభాస్ రాముడిగా నటించడం. ఈనెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మొదటిసారి టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ట్రైలర్ తో సినిమా యూనిట్ నెగెటివిటీని తగ్గించగలిగింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ వస్తోంది. చిత్ర యూనిట్ ఈ హైప్…

National

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా…