National

National

నిరుద్యోగులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం మసాజ్ థెరపిస్ట్(Massage Therapist) పోస్టుల భర్తీ కోసం SAI అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వచ్చే నెల జూన్ 11లోపు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి వివరాలు పరిశీలిద్దాం. ఖాళీల వివరాలు మసాజ్ థెరపిస్ట్-9…

National

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్!

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొందరికి తీపికబురు అందించింది. అలాగే ఇంకొంత మందికి ఝలక్ ఇచ్చింది. దీని వల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని భావించే వారిపై ప్రభావం పడనుంది. ఇంకీ బ్యాంక్ (Bank) ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ (EMI) భారం…

NationalTELANGANA

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి.. విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు…

APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు…

National

నవీన్ పట్నాయక్: ఒడిషా అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సూపర్ సీఎం

భువనేశ్వర్: ఈరోజు ఒడిశా రాజకీయాలకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన రోజు. నవీన్ పట్నాయక్, దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మాస్ లీడర్, 2019 లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు మరియు అదే రోజున 5వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన ఆయన ఇప్పుడు 5వ దఫా పాలనకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది కొత్త శకానికి చేరుకుంది. 20…

National

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్…

National

డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన – రేవంత్ కు షాక్..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ – షర్మిల మధ్య ఫోన్ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ రంగంలో కి దిగారు. షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు జరుగున్నాయి. ఇదే సమయంలో రేవంత్ కు పార్టీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.…

National

40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, రేపు అమిత్ షా

మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 40 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు వెల్లడించారు. అంతేగాక, తిరుగుబాటుదారులను సీఎం బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతా బలగాల నుంచి సమాచారం అందిందని ఆయన మీడియాకు తెలిపారు. ‘సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్పైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. భారత సైన్యం,…

National

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ: 2024 ఎన్నికలపై దిశానిర్దేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేవంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరింతగా ప్రజల మద్దతు సంపాదించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం లేని చోట తమ స్థానాన్ని ఎలా…

APNational

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇక ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ…