జైళ్లలోని ఖైదీలకు ఓటు హక్కుపై సుప్రీంకోర్టులో విచారణ… కేంద్రానికి, ఈసీకి నోటీసులు..
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్ష ఖరారు కాని సుమారు 4.5 లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ…

