TELANGANA

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా..

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.   వివరాల్లోకి వెళితే, కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) అప్పగించింది. ఈ భూములను అభివృద్ధి చేసి,…

APTELANGANA

చంద్రబాబుతో చర్చలకు రేవంత్‌రెడ్డి సిద్ధం..!

ఏపీతో ఎలాంటి వివాదాలు తాను కోరుకోవడం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఫ్లడ్ వాటర్ తరలిస్తే బాగుంటుందని సూచించారు. గోదావరి, కృష్ణా నీటిని తరలించాలనే నిర్ణయమే మేజర్ సమస్య అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నెల 23న…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు.   వివరాల్లోకి వెళితే… కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్‌ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి…

TELANGANA

యూకేకి బయల్దేరిన కేటీఆర్..! ఎందుకంటే..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.   ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, గతంలో తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం…

TELANGANA

రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే ఈ దారుణాలు బయటకు వచ్చాయి: షర్మిల…

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిందని ఆమె అన్నారు. ఒకవేళ గత ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.   కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడలేదని షర్మిల స్పష్టం చేశారు. గతంలో తన ఫోన్‌ను కూడా ట్యాప్…

TELANGANA

తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ’ (దోస్త్‌) మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మరియు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపళ్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.   పొడిగించిన గడువు ప్రకారం, అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో వెబ్…

TELANGANA

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ కోటి రూపాయల విరాళం..

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయింది.   ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి ఆలయ…

TELANGANA

బనకచర్ల అన్యాయంపై ఉత్తమ్‌ వద్ద సమాధానం లేదు: ఎంపీ అర్వింద్..

బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పమంటే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వద్ద సమాధానం లేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారని అర్వింద్ ఆరోపించారు.   బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా ఎన్నో వినతిపత్రాలు స్వీకరించాం. ముఖ్యంగా చాలా మంది దివ్యాంగులు…

APTELANGANA

కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు… రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?” అంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో…

TELANGANA

తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ అంశంలో మరో మలుపు… షర్మిల ఫోన్ ట్యాప్..!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది.   ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా…