TELANGANA

TELANGANA

కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.చెట్లు కొట్టేసే ముందు 1996లో…

TELANGANA

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..! సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని.. ష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినని.. లీడర్లు అర్ధం కాకపోతే ఎలా అంటూ ఫైరయ్యారు.   ఎమ్మెల్యేలకు CM రేవంత్ సీరియస్ వార్నింగ్  …

TELANGANA

తెలంగాణలో అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలు..! దేశంలోనే మొట్టమొదటిసారి..!

రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రారంభ దశలో భాగంగా, ఫ్రాన్స్ నుంచి మూడు అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. ఒక్కో రోబో విలువ సుమారు రూ. 2 కోట్లు కాగా, మొత్తం…

TELANGANA

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి..

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది ఎంపికయ్యారని… అదేవిధంగా 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  …

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్..

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.   కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూములు ప్రభుత్వ భూములేనని అందులో పేర్కొంది. ఈ భూముల్లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం, మరికొన్ని సంస్థలు, బస్టాండ్ వంటివి వచ్చాయని తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా ఈ 400 ఎకరాల స్థలం…

TELANGANA

మంత్రి పదవి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం పక్కా అని, ఆ మేరకు పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రస్తావించారు.   ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.…

TELANGANA

అమల్లోకి భూ భారతి చట్టం..!

ధరణిని రీప్లేస్‌ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్‌లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?   ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో.. భూ భారతి పోర్టల్‌ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్…

TELANGANA

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు..

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.   ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, సాంకేతిక సమస్యల కారణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తోందని…

TELANGANA

రాజాసింగ్‌తో బండి సంజయ్ భేటీ.. ‘కత్తర్ హిందూ’ అంటూ..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడని, హిందూ ధర్మం కోసం పోరాడే ‘కత్తర్ హిందువు’ (వీర హిందువు) అని ప్రశంసించారు. హిందూ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారి రాజాసింగ్ తన ప్రాణాలకు తెగించి పోరాడారని కొనియాడారు.   పాతబస్తీలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్‌తో బండి సంజయ్ సమావేశమయ్యారు.…

TELANGANA

మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..

మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.   ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై…