TELANGANA

TELANGANA

తెలంగాణాలో త్వరలో మరో ఎన్నికల పండుగ : సన్నాహాలు మొదలెట్టిన ఈసీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఇటీవలే అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికల పండుగ ముగిసింది. ఇప్పుడు మరో ఎన్నికల పండుగకు ముహూర్తం ఖరారయింది. నిన్నా మొన్నటి దాకా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి నుండి ఇంకా రాజకీయ పార్టీలు ఊపిరి తీసుకోక ముందే మళ్లీ త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది.   తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోక ముందే వెంటనే మళ్ళీ ఎన్నికలు రావడం ఆసక్తిగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే…

TELANGANA

తెలంగాణ సీఎం ఎంపికపై రాహుల్ కీలక భేటి..? నిర్ణయం ఏంటంటే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయమైంది. 64 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. ఒకవైపు ముగ్గురు నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అందరినీ కలుపుకుపోయే, పొరుగు రాష్ట్రా్టలతో సన్నిహితంగా ఉండే, కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకునే వ్యక్తి సీఎం అయితేనే కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుంది. ఇన్ని సవాళ్ల మధ్య సీఎం అభ్యర్థి ఎంపిక…

TELANGANA

రేవంత్‌ సీఎం అయితే మాకు పదవులొద్దు.. కాంగ్రెస్‌ లో సీనియర్ల తిరుగుబాటు..?

లీకులపై సీరియస్‌.. సీఎం పీటం విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్‌ ఎవరూ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో హైకమాండ్‌ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్‌ వైపు హైకమాండ్‌ మొగ్గు చూపుతుందనే సమాచారంతో సీనియర్లు ఒక్కటయ్యారు. ముందుగా హైదరాబాద్‌లో వారు డీకే శివకుమార్‌తో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. డీకే శివకుమార్‌ సూచనతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్‌ కు డీకే శివకుమార్‌ నివేదించారు. దీంతో..పార్టీ హైకమాండ్‌ సూచన…

TELANGANA

రాజీనామాలు చేస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్లు..

పలు కార్పొరేషన్ల పదవులకు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా వారిలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ రాజీనామా చేశారు.  …

TELANGANA

సీఎం పదవిపై బిగ్ ట్విస్ట్, సీనియర్లకు ఢిల్లీ పిలుపు- నిర్ణయం వాయిదా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే ప్రచారం వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ తో సహా ముఖ్యనేతలను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం సూచించింది. రేపు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కీలక భేటీ జరగనుంది. అందరితో సంప్రదింపుల తరువాతనే సీఎం అభ్యర్దిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సీఎంగా చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.   సీఎం ఖరారులో బిగ్ ట్విస్ట్:తెలంగాణ ముఖ్యమంత్రి…

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…

TELANGANA

BRS ఓటమికి కారణాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతగా ఆదరించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఒక రిపోర్ట్.   తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత రెండు దఫాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ…

TELANGANA

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా..

అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   కాగా, ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు…

TELANGANA

ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.   పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం…

TELANGANA

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.   సోమవారం సాయంత్రం…