TELANGANA

TELANGANA

రేవంత్ మంత్రివర్గంలోకి మరో ఆరుగురు…

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ లో మరో ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్దంగా ఉన్నారు. జాబితా సిద్దం చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది.   కేబినెట్ విస్తరణ :…

TELANGANA

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ..

తెలంగాణ సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేవంత్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీసారు. కొద్ది సేపు కేసీఆర్ తో ముచ్చటించారు. కేసీఆర్ కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను ఆరా తీసారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి సీఎం రేవంత్ : సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్…

TELANGANA

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సిఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

ఆడబిడ్డల ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.   “తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి…

TELANGANA

త్వరలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రొ టెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో బిజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంఐఎంతో రాజకీయ లబ్ధ కోసమే అక్బరుద్దీన్‌ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించారని ఆరోపణలు చేశారు.   మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి నామినేషన్లకు రెండు రోజుల గడువు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్‌ను…

TELANGANA

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. ఇంకా క్యాంపు ఆఫీస్‌లోనే తిష్ట..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాజీ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారటం లేదు. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిర్వాకం.. స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి.. కొత్తగా ఎన్నికైనా వారికి ఇవ్వాల్సిన ఆయన.. ఆ ఆఫీస్‌లోనే మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతూ.. బిజీబిజీగా ఉన్నారు.   ఓటమి తర్వాత BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR రాజీనామా చేసి ప్రగతి భవన్…

TELANGANA

కోదండరామ్‌కు సముచిత స్థానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి..?

టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నంది. కోదండరామ్‌కు నూతన సర్కార్‌ లో సముచిత స్థానం లభించనుంది.   కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా…

TELANGANA

ఆరు గ్యారంటీల ఫైలుపై రేవంత్ తొలి సంతకం-రజనీకి ఉద్యోగమిస్తూ రెండో సంతకం..

ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన రెండు కీలక ఫైళ్లపై సంతకాలు చేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన రెండు హామీలపై ఆయన ఈ సంతకాలు చేశారు. దీంతో ప్రమాణస్వీకార వేదిక అయిన ఎల్బీ స్డేడియంలో హర్ష్వధ్వానాలు మిన్నంటాయి.   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే…

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.   ఆ తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క , ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్,…

TELANGANA

మంత్రులకు శాఖల ఖరారు – నేడే తొలి మంత్రివర్గ భేటీ..!!

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖల ఎంపిక పైన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 11 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక..మిగిలిన 10 మందికి శాఖల కేటాయింపు పైన స్పష్టత వచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇక, తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది.   శాఖలు కేటాయింపు : తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన…

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.   రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా.. రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు. అయితే, రేవంత్…