TELANGANA

TELANGANA

తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు..

తాను రైతు బిడ్డనని.. వ్యవసాయం తమ సంస్కృతి అని ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోక్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్నరైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని రేవంత్ పేర్కొన్నారు.   భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని.. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా…

TELANGANA

వైసీపీ నాలుగో జాబితా విడుదల..

సుదీర్ఘ కసరత్తు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే.   అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే:   జీడీ…

NationalTELANGANA

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతన్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే రామ మందిరానికి తలుపులు, పాదుకలు ఇక్కడ్నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి.   తాజాగా, అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ…

TELANGANA

తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా ఆయన బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుపర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. దిగ్గజ గ్రూప్ అదానీ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.దావోస్పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ సంస్థ రాష్ట్రంలో రూ.12,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.…

TELANGANA

గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గత ప్రభుత్వం(బీఆర్ఎస్ సర్కారు) ప్రతిపాదించిన విషయం తెలిసిందే.   ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ(దాసోజు శ్రవణ్,…

TELANGANA

నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కవిత…

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు.   ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత…

TELANGANA

ప్రజాపాలనలో దరఖాస్తు చేసారా, ఏ పథకానికి మీరు అర్హులు – ఇలా చెక్ చేసుకోండి..!!

ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి. మిగిలినవరి మార్చి 15 లోగా ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇక దరఖాస్తు చేసిన వారు ఏ పథకానికి అర్హులు, వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.   దరఖాస్తుల పరిశీలన: కాంగ్రెస్ ప్రభుత్వం…

TELANGANA

భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌(నార్త్) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించే ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది.   ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి…

TELANGANA

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(Fourth Industrial Revolution) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కానుంది.   సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్…

TELANGANA

దావోస్‌లో రేవంత్ రెడ్డి పర్యటన ..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.   పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లో ఈ సిటీలో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి…