TELANGANA

TELANGANA

తెలంగాణలో పెన్షన్ రూ 4 వేలకు పెంపు హామీ – ప్రభుత్వం తాజా నిర్ణయం..!

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్‌ డబ్బులు ఇస్తారని లబ్ది దారులు ఆశించారు. కానీ, ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత ఫించన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కార్‌ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.  …

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు..

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ తాజాగా ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.   హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు…

TELANGANA

కేటీఆర్‍ మతిస్థిమితం కోల్పోయారు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు…

మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని చెప్పారు.   గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు…

TELANGANA

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

TELANGANA

హైదరాబాద్ నడిబొడ్డున గల చారిత్రక ఆలయంలో.. గవర్నర్..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను ప్రారంభించారు. కొద్దిరోజుల కిందటే నాసిక్‌లోని ప్రాచీన…

TELANGANA

కరెంట్ బిల్లులు కట్టవద్దు, సోనియాకు పంపండి – కేటీఆర్..!!

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. వీటి పైన కేటీఆర్ స్పందించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ సూచించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.   దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు…

TELANGANA

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బంగారు చీర!!

దేశమంతా ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుందా? ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా? అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి రామయ్యకు కానుకలు తరలి వెళుతున్నాయి.   500కు పైగా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు తాను నడయాడిన పుణ్యభూమిలో కాలు పెడుతున్న సమయంలో రామయ్య పైన భక్తితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి…

TELANGANA

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ సీనియర్లు.. .

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు. అయితే లోక్సభ నియోజకవర్గాల సమీక్ష తో పాటు, నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   చాలా జిల్లాలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు!!

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2024 ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో మేడారంలో అభివృద్ధి పనులపై తెలంగాణా సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడారం అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది,…