తెలంగాణలో పెన్షన్ రూ 4 వేలకు పెంపు హామీ – ప్రభుత్వం తాజా నిర్ణయం..!
తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్ డబ్బులు ఇస్తారని లబ్ది దారులు ఆశించారు. కానీ, ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత ఫించన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కార్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. …

