TELANGANA

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

TELANGANA

వేములవాడలో తుల ఉమ వర్సెస్ బీజేపీ!.. వికాస్‌రావుకు బీఫామ్‌ ఇవ్వడంతో రచ్చ..

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తి సెగలు కాకరేపుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తుల ఉమ వర్సెస్‌ బీజేపీ పాలిటిక్స్‌ మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ.. ఆమెకు బీఫామ్‌ ఇవ్వకుండా వికాస్‌రావును బరిలో దించడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.   తనకు టికెట్ కేటాయించి ఆ తర్వాత బీఫామ్‌ ఇవ్వకుండా పోటీ నుంచి తప్పించడంతో బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తుల ఉమ. ఎవరైనా బీజేపీ నేతలు…

TELANGANA

మాదిగ విరోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్.. త్వరలో ఎస్సీ వర్గీకరణ కమిటీ : ప్రధాని మోదీ..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉపకులాలను విరోధులగా చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించారు.   మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ…

TELANGANA

రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్…

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సిసలు ప్రచార హోరు మొదలవనుంది. ఈ దీపావళి ఏ పార్టీల్లో వెలుగులు నింపుతుంది.. ఏ పార్టీకి చీకట్లు నింపుతుందన్నది ఉత్కంఠగా మారింది. పైకి ముక్కోణపు పోరు అంటున్నా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అసలైన ఎన్నికల యుద్ధం కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి.   ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన…

TELANGANA

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే..?

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 3,500కుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసలు సిసలు పోరాట ఘట్టం మొదలవబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. మరోవైపు చివరి రోజు అభ్యర్థుల మార్పుతో బీజేపీ అసంతృప్తి పెరిగింది.   తెలంగాణలో నామినేషన్ల గడువు ముగియడంతో తదుపరి ప్రచారాలపై పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెంచుతున్నాయి. చాలా చోట్ల అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లు నింపడంలో ముఖ్య పార్టీల నేతలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తడబడ్డారని చెబుతున్నారు.…

TELANGANA

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి.. వ్యూహాత్మకంగా కామారెడ్డిలో పోటీ..

కామారెడ్డి గడ్డపై నుంచి జంగ్‌ సైరన్‌ మోగించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కారు జోరుకు కామారెడ్డి నుంచే బ్రేక్‌ పడబోతుందని పిలుపునిస్తూ ఆశేష జనవాహిని వెంటరాగా.. కాంగ్రెస్‌ బలం, బలగాన్ని చాటిచెప్పారు. నామినేషన్‌ వేయడంలో లాస్ట్ కావచ్చు కానీ.. విక్టరీ కొట్టేది ఫస్ట్‌ మనమే అంటూ హస్తం నేతల్లో జోష్‌ నింపుతూ.. గులాబీ నేతల్లో గుబులు రేపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కీలక ఘట్టం ఇది. వేలాది మంది వెంటరాగా.. కర్ణాటక సీఎం…

APTELANGANA

బీఆర్ఎస్ కు అండగా ఏపీ నేతలు.. ఆ ఇద్దరు ఎవరు…?

తెలంగాణ ఎన్నికల్లో సర్వేల నుంచి పంపకాల వరకు అంతా ఏపీ నేతలదే కీలకపాత్ర. ఇదేంటి తెలంగాణ ఎన్నికలతో ఏపీ నేతలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది వాస్తవమేనట. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకీ బీఆర్ఎస్‌ కు దన్నుగా నిలుస్తున్న ఆ ఇద్దరు ఎవరు?   తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్‌…

TELANGANA

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఖరారు…

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) బరిలో రోజురోజుకీ దూసుకుపోతున్న కాంగ్రెస్.. అన్నిపార్టీలను కలుపుకొని ముందుకు సాగుతోంది. ఇన్ని రోజులుగా సీట్ల కేటాయింపులపై కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ లతో రాజీకుదరకపోవడంతో ఇక పొత్తు ఉండదేమోననే అభిప్రాయం అందరిలో కలిగింది. దానికి కారణం కమ్యూనిస్టులు ఒంటరి పోరు చేస్తున్నట్లు ప్రకటించడమే. కానీ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృషితో ఇరు పక్షాల మధ్య డీల్ కుదిరింది.   కమ్యూనిస్టు పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం…

TELANGANA

గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులే నా ఓటుబ్యాంకు : ఈటల రాజేందర్

తెలంగాణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకనబోయే నేతలలో ఒకరైన ఈటల రాజేందర్(Eetala Rajender) ఒకరు. కేసీఆర్ పోటీచేయబోయే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.   ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “పదేళ్లలో కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదు.. కేవలం ఎన్నికల ముందు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్(BRS) నేతల గుండెల్లో…

TELANGANA

కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్ .

సింగరేణి (Singareni) సంస్థకు నష్టాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.   సీఎం కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ.. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయి. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో…