“కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది”.. కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ధ్వజం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. దానిపై వాస్తవాల గురించి మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు . అంచనాలను పెంచి దోపిడీ చేశారని మంత్రి కేటీఆర్కు కౌంటరిచ్చారు. నిపుణుల నివేదికను సీఎం కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి తానే కర్త,కర్మ,క్రియ అని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోగానే ఆ నెపాన్ని సాంకేతిక నిపుణుల మీదికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారని…

