TELANGANA

TELANGANA

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది.   కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా…

TELANGANA

బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు….

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజరాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసీలు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతోన్న టీవీ ఛానెల్ ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానెల్ ఎప్పటిలోగా ఖాలీ చెస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.   ఈ మేరకు తెలంగాణ భవన్…

TELANGANA

అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.   ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా…

TELANGANA

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డితో కరణ్ అదానీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా.. తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు.…

TELANGANA

సోనియా తెలంగాణ నుంచే పోటీ: బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలంటూ రేవంత్ ఫైర్, ఇక ఊరుకోవద్దు!

హైదరాబాద్: ప్రతిపాక్ష పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi)ని పోటీ చేయాలని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం చేశారు. దీంతో పాటు మరో రెండు తీర్మానాలను ఈ సమావేశంలో సీఎం ప్రతిపాదించారు. మొదటి తీర్మానంగా ఏఐసీసీ తెలంగాణ…

TELANGANA

రేవంత్ కొత్త సంవత్సర కానుక.. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు…

TELANGANA

కెసిఆర్.. 22 కార్లు.. సస్పెన్స్

సరిగ్గా మూడు రోజుల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో బట్టబయలు చేసిన 22 కార్ల కహాని రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. మొదట్లో ఈ కార్ల గురించి ఎదురుదాడికి దిగిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఆ తర్వాత రోజుకో రకంగా మాట మార్చారు. కార్లు కొనుగోలు చేయలేదని కొంతమంది, కార్లు కొనుగోలు చేస్తే తప్పేంటని, కార్ల కొనుగోలు బాధ్యత ఇంటలిజెన్స్ చూసుకుంటుందని.. ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. సరే ఇవన్నీ పక్కన…

TELANGANA

మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు..

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా…

TELANGANA

అభయహస్తం దరఖాస్తుకు ఆధార్ అప్ డేట్ తప్పని సరి కాదు!

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాసాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతోపాటు, రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు గడిచినా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే పథకాలకు తాము అర్హులం, ఎలా దరఖాస్తుత చేసుకోవాలి, రేషన్‌ కార్డు తప్పనిసరా? ఆధార్‌ కుటుంబంలో అందరికీ లేదు..…

TELANGANA

నల్ల నేలల్లో కేసీఆర్ గులాబీ బాణం విరగడానికి కారణాలు ఎన్నో..?

పాలనలో మితిమీరిన జోక్యం ఎక్కువ కావడంతో కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. తెలంగాణకు సిరిలాంటి సింగరేణి గనుల్లో కేసీఆర్ కుటుంబం పెత్తనం కూడా పెరిగిపోవడంతో ఇక్కడ కూడా రిక్త హస్తమే అందించారు. సింగరేణి గనుల్లో ఈసారి బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా కనుమరుగైంది. రెండు సార్లు సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ అనుబంధ విభాగం టీబీజీకేఎస్‌ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి చెందింది.…