TELANGANA

TELANGANA

“కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది”.. కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ధ్వజం..

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. దానిపై వాస్తవాల గురించి మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు . అంచనాలను పెంచి దోపిడీ చేశారని మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. నిపుణుల నివేదికను సీఎం కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి తానే కర్త,కర్మ,క్రియ అని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోగానే ఆ నెపాన్ని సాంకేతిక నిపుణుల మీదికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారని…

TELANGANA

బీఆర్ఎస్ గెలుపు కోసమే ఆ స్థానం నుంచి ఎంఐఎం పోటీ..!

తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలలో మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) కూడా ఒకటి. జాతీయస్థాయిలో పాపులారిటీ ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ పార్టీకి నాయకుడు. ముస్లిం, మైనారిటీల సమస్యలపై ప్రశ్నిస్తూ ఎంఐఎం తెలంగాణతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా పలు రాష్ట్రాల ఎన్నికలలో కూడా పోటీచేస్తోంది.   మరి జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ఎంఐఎం పార్టీ సొంత రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి ఎప్పుడూ పాతబస్తీ(ఓల్డ్ సిటీ)లోని కేవలం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తుంది. కారణం…

TELANGANA

మేడిగడ్డ అందుకే కుంగిందా ? NDSA సంచలన రిపోర్ట్…

కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లేనా? ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపం ఉందా? అని మొదటి నుంచి వస్తున్న అనుమానాలే నిజమయ్యాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఫోకస్ చేసిన అథారిటీ.. ఆ బ్యారేజ్ ప్లానింగ్‌కు, డిజైన్‌కు తేడా ఉందని గుర్తించింది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ వరకు అడుగడుగునా లోపాలు ఉన్నాయి. 16, 17, 19, 20 పిల్లర్లలో పగుళ్లు ఉన్నాయని గుర్తించిన…

TELANGANA

ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీలో 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలిచింది. ఆ ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో తిరిగి పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ వెల్లడించారు.   చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్ , మలక్ పేట ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు…

TELANGANA

నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్ మాత్రం ఒక్క సెట్ కే చెల్లించాలని చెప్పారు. అఫిడవిట్‌లోని కాలమ్స్ అన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.   అక్టోబరు 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10కి పూర్తి…

TELANGANA

వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ జోరు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ బిబీగా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో పట్టణాల ఓటర్ల సంఖ్య కంటే గ్రామాల్లో ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితా ప్రకారం.. కొత్తగా గ్రామీణ ఓటర్లు ఎక్కువ మంది నమోదయ్యారు.   దీంతో గ్రామాల్లో ఓటింగ్ చైత‌న్యం పెరిగిందని చెప్పవచ్చు. ప్ర‌ధాన పార్టీలు కూడా గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హామీలు ప్రకటిస్తున్నాయి.…

TELANGANA

కమీషన్ ఇస్తేనే దళిత బంధు.. లంచాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్‌ నాయకులు..

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కమీషన్ల సర్కార్‌గా మారిపోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దళితబంధు స్కీంలో లంచాలు లేనిదే నిధులు విడుదల కావడం లేదంటూ చాలా మంది మొత్తుకుంటున్నారు. అంతెందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఇదే విషయంలో హెచ్చరించారు కూడా.   దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని కేసీఆర్ అన్నారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి…

APHealthNationalTELANGANA

అందుబాటులోకి చికన్‌ గున్యా వ్యాక్సిన్‌..?

దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు పాకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదం తెలపడం ఊరటనిచ్చే విషయం.   ఫ్రెంచి డ్రగ్ కంపెనీ వాల్నెవా ఈ టీకాను తయారు చేసింది. తొలుత అమెరికా ట్రావెలర్లు, సీనియర్ సిటిజన్లకు…

TELANGANA

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు…

తెలంగాణ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముందు కీలక నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ ప్రదర్శిస్తున్న సాఫ్ట్ కార్నర్ ను చూడలేకే తాము పార్టీ మారుతున్నామని వారు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలో కీలక పాత్ర పోషించి వేర్వేరు కారణాలతో పార్టీ మారిన కీలక నేతలంతా ఇప్పుడు ఘర్ వాపసీ అంటూ హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపుతున్నారు.   ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తితో ఉన్న…

TELANGANA

రాజకీయ దుమారం రేపుతోన్న దుబ్బాక ఘటన.. పార్టీల విమర్శనాస్త్రాలు..

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థిపై కత్తి పోటు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటన వెనుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే.. ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. హింసను తాము ప్రేరేపించమని.. దీనిపై వెంటనే విచారణ జరిపాలని డిమాండ్ చేస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.   తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచార జోరులో ఉన్నారు. ఈ క్రమంలో దుబ్బాక బీఆర్‌ఎస్‌…