TELANGANA

TELANGANA

కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి.. 6 గ్యారంటీలే గెలిపిస్తాయని రేవంత్ ధీమా..

కొల్లాపూర్‌ లో కాంగ్రెస్‌ పాలమూరు ప్రజాభేరి సభకు ప్రజలు పోటెత్తారు. ఈ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో రాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హెలికాఫ్టర్ ప్రయాణం రిస్క్ అని చెప్పినా రాహుల్ గాంధీ తెగించి వచ్చారన్నారు.   బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్…

TELANGANA

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై జరిగినట్టే..!..

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని మొదట గజ్వేల్‌లోని ఆస్పత్రికి…

TELANGANA

పోలీసుల ముసుగులో డ్యూటీ.. రూ.18లక్షలు లూటీ

దోపిడీ చేస్తూ పట్టుబడితే పోలీసులకి అప్పగిస్తారు. ఆపై అధికారులు శిక్షిస్తారు. అదే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏం చేసిన అడిగే వారు ఎవరు ఉండరు. డ్యూటీ పేరుతో లూటీ చేసిన ఎవరికీ అనుమానం రాదు అనుకుని.. యూనిఫామ్ ముసుగులో ఏం చేసిన చెల్లుతుంది అని పొరపాటు పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల అవతారం దాల్చారు. డ్యూటీకి దిగి లూటీకి పాల్పడ్డారు. చెకింగ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 లక్షలను మాయం చేశారు ఈ…

TELANGANA

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 దశాబ్దల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లు చెక్కు చెదరలేదు అని ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే రాష్ట్రంలో మొదట గెలిచే స్థానం కామారెడ్డినే అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడగొట్టే మొగొడు రేవంత్…

TELANGANA

అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్..

లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు. నేల తల్లి నుదిటిన తిలకం పెట్టిన యువతది ఈ కోరుట్ల ప్రాంతం.. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం నా పూర్వజన్మ సుకృతం.. కోరుట్ల నియోజకవర్గం రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది అని…

TELANGANA

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ కు అమ్ముడుపోతారు.

సూర్యాపేటలో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ కు అమ్ముడుపోతారు అంటూ తెలిపారు. గ్రామ పంచాయితీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు. ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఖరారైన బీజేపీ అభ్యర్ధులను సభకు…

TELANGANA

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతలు

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా నేతలు జాయిన్ అయ్యారు. నవాబుపేట మండలం కొండాపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదర చారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న దామోదరచారి బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి…

SPORTSTELANGANA

హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు

హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్ అండ్…

TELANGANA

వంద జన్మలెత్తినా సాధించలేరు: రాహుల్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి.…

TELANGANA

టీఆర్ఎస్‌కు సిలిండర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజ్య సమితి (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితిని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో…