TELANGANA

TELANGANA

రాజీనామాలు చేస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్లు..

పలు కార్పొరేషన్ల పదవులకు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా వారిలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ రాజీనామా చేశారు.  …

TELANGANA

సీఎం పదవిపై బిగ్ ట్విస్ట్, సీనియర్లకు ఢిల్లీ పిలుపు- నిర్ణయం వాయిదా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే ప్రచారం వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ తో సహా ముఖ్యనేతలను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం సూచించింది. రేపు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కీలక భేటీ జరగనుంది. అందరితో సంప్రదింపుల తరువాతనే సీఎం అభ్యర్దిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సీఎంగా చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.   సీఎం ఖరారులో బిగ్ ట్విస్ట్:తెలంగాణ ముఖ్యమంత్రి…

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…

TELANGANA

BRS ఓటమికి కారణాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతగా ఆదరించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఒక రిపోర్ట్.   తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత రెండు దఫాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ…

TELANGANA

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా..

అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   కాగా, ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు…

TELANGANA

ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.   పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం…

TELANGANA

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.   సోమవారం సాయంత్రం…

TELANGANA

కేసీఆర్ కు వైఎస్ షర్మిల అదిరిపోయే గిఫ్ట్!!

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఒక ఆసక్తికరమైన గిఫ్ట్ ను పంపుతున్నానని ప్రకటించారు. కెసిఆర్ ఇక ఇంటికి వెళ్ళే సమయం వచ్చిందంటూ ప్యాకప్ చేసుకునేందుకు బై బై కేసీఆర్ అని రాసి ఉన్న ఒక ట్రాలీ బాక్స్ ను పంపుతున్నట్టుగా ఆమె వెల్లడించారు.   తెలంగాణ రాష్ట్ర ప్రజలు బై బై కేసీఆర్…

TELANGANA

వైన్స్, రెస్టారెంట్లు బంద్, 144 సెక్షన్: ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకూ ఈ నిబంధన వర్తిసుందని అధికారులు ఆదేశించారు.   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ…

TELANGANA

సీఆర్ఎఫ్ ఆధీనంలోకి నాగార్జున సాగర్.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల విడుదల విషయంలో నవంబర్ 28న ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది.   నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.…