TELANGANA

TELANGANA

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి, రేపట్నుంచే

హైదరాబాద్: వినియోగదారుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త పథకాలను తీసుకొస్తొంది. తాజాగా, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు,…

TELANGANA

ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి.. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. సంస్థ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభాకర్ రావు. అంతేగాక, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా.. ఐఏఎస్ అధికారులు విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్…

TELANGANA

బీఆర్ఎస్‌కు ఆకుల లలిత గుడ్‌బై

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు. తాజాగా, ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరొకరు మాత్రం ఏ పార్టీలో చేరాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…

TELANGANA

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. బెనిఫిట్స్ మాములుగా లేవుగా..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. ఇప్పటివరకు అందించిన ఫీచర్స్ జనాలను ఆకట్టుకున్నాయి..తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది..వాట్సాప్ బిజినెస్ ఇండికేటర్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది..యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా సర్వీసెస్‌లను కొన్ని బిజినెస్ యజమానులు ఉపయోగిస్తారు. ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. ఈ ఫీచర్ గురించి…

APTELANGANA

హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైల్‌పై ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్…

APTELANGANA

హైదరాబాద్ నుంచి సింగపూర్ విమానాలు పెంపు, బోయింగ్ కూడా

హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు…

APTELANGANA

‘ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం అదే’

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా చంద్రబాబును అరెస్టును ఖండించారు. అయితే, నందమూరి…

TELANGANA

హరీశ్ సమక్షంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాభివందనం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం మరోసారి అంధకారంలోకి వెళుతుందన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ విజయవంతం కోసం నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీ లపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి లపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్, నిజామాబాద్ పోలీస్…

TELANGANA

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం బండి సంజయ్‌ను కలిశారు. ఆరెపల్లితోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పార్టీలో చేరతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, 2009లో ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత…