TELANGANA

TELANGANA

హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి…

TELANGANA

కాంగ్రెస్ పాలన చాలా వింతగా ఉంది: కేసీఆర్..

కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు…

TELANGANA

ఉగాది నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. ఉత్తమ్ కీలక ప్రకటన..

ఉగాది నుంచి రేషన్‌ కోటాలో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి చెప్పారు. నిజమైన ఆహారభద్రత కోసం సన్నబియ్యం పంపిణీ ఈనెల 30నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. మూడు రకాల రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సన్నబియ్యం ఇవ్వబోయే తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. కొత్తరేషన్లు కార్డుల దరఖాస్తులు, మంజూరు నిరంతర ప్రక్రియగా ఉండబోతుందన్నారు. రేషన్‌లో భాగంగా…

TELANGANA

అప్పులపై కాగ్ రిపోర్ట్..! ఏం తేల్చింది..?

తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేటే నడుస్తోంది. జమాఖర్చులు, అప్పులు, రీపేమెంట్ల చుట్టూ గందరగోళం సీన్ క్రియేట్ చేసేలా మ్యాటర్ మారింది. అయితే ఈ కాగ్ రిపోర్ట్ ను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే.. బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ ఊహలకు, చేసిన ఖర్చులకు పొంతన లేదని కాంగ్రెస్ లెక్కలు చూపిస్తోంది. ఈ విషయంలో ఎవరి లెక్క వారిదే అన్నట్లుగా మారింది. అయితే ఏది నిజం? బీఆర్ఎస్ అప్పులు తెచ్చి…

TELANGANA

తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు.. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి రూటే సెపరేటు. ఆయన స్టైల్ అందరికంటే డిఫరెంట్. ఏదో వచ్చామా.. ఏదో చేస్తున్నామా.. అన్నట్టు ఉండరు. రేవంత్ రంగంలోకి దిగారంటే.. దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టే ఉంటుంది. నీళ్లు చల్లి.. బొట్టు పెట్టి.. ముస్తాబు చేసి.. మైసమ్మకు బలి ఇవ్వాల్సిందే. లేటెస్ట్‌గా కేంద్ర ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు, కదుపుతున్న పావులు.. రాజకీయ కురవృద్ధులనే కంగు తినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాక రేపుతున్నాయి.   డీలిమిటేషన్‌పై…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. !

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. తన నియోజకవర్గం సిరిసిల్ల లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కు వెళ్దాం.. ఎక్కడైన వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒక వేళ వంద శాతం రుణమాఫీ జరిగినట్లు ప్రూఫ్ అయితే రాజకీయాలే వదిలేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు.   ‘ఎంపీ ఎన్నికల్లో మాకు వచ్చింది గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చింది…

TELANGANA

‘విద్య’పై రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం..?

విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యా రంగంపై శాసనమండలిలో జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.   2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందీ తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస…

TELANGANA

ఉప ఎన్నికలపై కోర్టు నిర్ణయిస్తుంది, రేవంత్ రెడ్డి సీఎంలా వ్యవహరించాలి: కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశం కోర్టు పరిధిలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.   శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉండబోవని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను విస్మరిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.   ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ వేదికగా తీర్పు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టుల్లోని అంశాలపై వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.…

TELANGANA

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై స్పందించిన వీసీ సజ్జనార్..

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ‘బలవన్మరణం వద్దు… బతికి సాధించడమే ముద్దు’ అని బెట్టింగ్ యాప్‌ల బాధితులకు సూచించారు.   ఆన్‌లైన్ బెట్టింగ్ బాధితులు బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. “ఆలోచించండి.. మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో. సమస్య వచ్చినప్పుడు…

TELANGANA

తెలంగాణకు భారీ పెట్టుబడి.. యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ..

చైనాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఫలించినట్టు సమాచారం. బీవైడీ యూనిట్ స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని బీవైడీకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది. యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌లోని మూడు ప్రదేశాలను ప్రభుత్వం ప్రతిపాదించగా, సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మూడింటిలో ఒకదానిని ఎంపిక చేయగానే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.…