TELANGANA

TELANGANA

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. నాలుగు రోజుల పసికందుతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల దలహర్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక…

TELANGANA

నాంపల్లి అగ్నిప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి : గవర్నర్

నాంపల్లిలో సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   ప్రభుత్వ వైఫల్యం వల్లే నాంపల్లి అగ్నిప్రమాదం : రేవంత్ రెడ్డి అగ్నిప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిపోయిందన్నారు. నగరంలో…

TELANGANA

అఫిడవిట్‌తో ఎన్నికల కమీషన్‌కే షాకిచ్చిన మంత్రి మల్లారెడ్డి..!

మల్లారెడ్డి అంటే మామూలు మనిషి కాదు. విద్యాసంస్థల అధినేత. మామూలు ఇన్‌స్టిట్యూట్స్ కావు. ఎంబీబీఎస్, ఎంబీయే, ఎంటెక్ వంటి కాస్ట్‌లీ కోర్సులు కూడా నేర్పిస్తారక్కడ. పైగా మంత్రి. కార్మిక శాఖను ఉద్దరించే బాధ్యత చూసిన మల్లారెడ్డి. అలాంటి మంత్రి తాను ఎక్కడ చదివానో మర్చిపోయినట్టున్నారు. అందుకే ఆయన అఫిడవిట్ చూసి ఎన్నికల సంఘానికే దిమ్మ తిరిగింది. కళ్లు బైర్లు కమ్మిన పరిస్థితి.   ఎందుకంటారా.. ఒక వ్యక్తి ఒకేసారి మూడు చోట్ల ఇంటర్ చదవడం సాధ్యమా? 9…

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

TELANGANA

వేములవాడలో తుల ఉమ వర్సెస్ బీజేపీ!.. వికాస్‌రావుకు బీఫామ్‌ ఇవ్వడంతో రచ్చ..

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తి సెగలు కాకరేపుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తుల ఉమ వర్సెస్‌ బీజేపీ పాలిటిక్స్‌ మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ.. ఆమెకు బీఫామ్‌ ఇవ్వకుండా వికాస్‌రావును బరిలో దించడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.   తనకు టికెట్ కేటాయించి ఆ తర్వాత బీఫామ్‌ ఇవ్వకుండా పోటీ నుంచి తప్పించడంతో బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తుల ఉమ. ఎవరైనా బీజేపీ నేతలు…

TELANGANA

మాదిగ విరోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్.. త్వరలో ఎస్సీ వర్గీకరణ కమిటీ : ప్రధాని మోదీ..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉపకులాలను విరోధులగా చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించారు.   మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ…

TELANGANA

రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్…

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సిసలు ప్రచార హోరు మొదలవనుంది. ఈ దీపావళి ఏ పార్టీల్లో వెలుగులు నింపుతుంది.. ఏ పార్టీకి చీకట్లు నింపుతుందన్నది ఉత్కంఠగా మారింది. పైకి ముక్కోణపు పోరు అంటున్నా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అసలైన ఎన్నికల యుద్ధం కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి.   ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన…

TELANGANA

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే..?

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 3,500కుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసలు సిసలు పోరాట ఘట్టం మొదలవబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. మరోవైపు చివరి రోజు అభ్యర్థుల మార్పుతో బీజేపీ అసంతృప్తి పెరిగింది.   తెలంగాణలో నామినేషన్ల గడువు ముగియడంతో తదుపరి ప్రచారాలపై పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెంచుతున్నాయి. చాలా చోట్ల అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లు నింపడంలో ముఖ్య పార్టీల నేతలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తడబడ్డారని చెబుతున్నారు.…

TELANGANA

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి.. వ్యూహాత్మకంగా కామారెడ్డిలో పోటీ..

కామారెడ్డి గడ్డపై నుంచి జంగ్‌ సైరన్‌ మోగించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కారు జోరుకు కామారెడ్డి నుంచే బ్రేక్‌ పడబోతుందని పిలుపునిస్తూ ఆశేష జనవాహిని వెంటరాగా.. కాంగ్రెస్‌ బలం, బలగాన్ని చాటిచెప్పారు. నామినేషన్‌ వేయడంలో లాస్ట్ కావచ్చు కానీ.. విక్టరీ కొట్టేది ఫస్ట్‌ మనమే అంటూ హస్తం నేతల్లో జోష్‌ నింపుతూ.. గులాబీ నేతల్లో గుబులు రేపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కీలక ఘట్టం ఇది. వేలాది మంది వెంటరాగా.. కర్ణాటక సీఎం…

APTELANGANA

బీఆర్ఎస్ కు అండగా ఏపీ నేతలు.. ఆ ఇద్దరు ఎవరు…?

తెలంగాణ ఎన్నికల్లో సర్వేల నుంచి పంపకాల వరకు అంతా ఏపీ నేతలదే కీలకపాత్ర. ఇదేంటి తెలంగాణ ఎన్నికలతో ఏపీ నేతలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది వాస్తవమేనట. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకీ బీఆర్ఎస్‌ కు దన్నుగా నిలుస్తున్న ఆ ఇద్దరు ఎవరు?   తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్‌…