TELANGANA

NationalTELANGANA

ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?

ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది. ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని…

NationalTELANGANA

కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పేరును ఆమె తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురంభీమ్ సహచరుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం. జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి…

APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో…

APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.…

TELANGANA

షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్- సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు: తేదీలు ఇవే

సికింద్రాబాద్: సాయినాథుణ్ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్లే భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. రోజువారీ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్…

TELANGANA

ఖమ్మంలో బీజేపీ లేదంటున్నారు: 15న అమిత్ షా సభతో తేల్చాద్దామంటూ బండి సంజయ్

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బీజేపీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూన్…

TELANGANA

భర్తను ఇనుప రాడ్ తో కొట్టి, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన గర్బిణి భార్య, క్లైమాక్స్ లో!

చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఆమె భర్త వదిలేశాడు. భర్త చనిపోయిన మహిళను భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగింది. ఇదే సమయంలో రెండో భార్య గర్బవతి అయ్యింది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ రెండో భర్త గొడవకు దిగాడు. రెండో భార్య ఆమె…

TELANGANA

మార్కెట్ లో కాసులు కురిపిస్తున్న ఈ పనుల ముందు ఉద్యోగాలు వేస్ట్!!

చాలామంది డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న వాళ్ళు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే జాబ్ కోసం నిరీక్షణ వేస్ట్ అని తాజాగా ఉన్న అనేక పనులు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేటు ఉద్యోగమైనా మనకంటూ స్వేచ్ఛ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కానీ…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…

TELANGANA

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఎండలు కూడా తీవ్రమే, వడగాలుల అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి…