TELANGANA

NationalTELANGANA

వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం…

TELANGANA

30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం

శనిదేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలను నిర్థారిస్తాడు. శని రాశుల్లో సంచరించడంవల్ల అన్ని రాశులవారిపై ప్రభావం ఉంటుంది. ఈ నెలలో 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమిస్తుంది. రాత్రి 10:48 గంటలకు సంచారం ఉంటుంది. ఇది శుభ సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల శని శశ రాజయోగం ఏర్పడుతుందని, అన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయని వెల్లడించారు. ఏయే రాశులవారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయో తెలుసుకుందాం. సింహ రాశి : 30 సంవత్సరాల తర్వాత శని…

TELANGANA

రహస్య ఒప్పందాలపై బిజెపి నోరు విప్పాలి: షర్మిల

హైదరాబాద్: రహస్య రాజకీయ ఒప్పందాలు ఎ పార్టీతో కుదుర్చుకున్నదో బిజెపి ప్రజలకు నోరు విప్పి చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా.. పోస్ట్ పోల్ ఒప్పందమా.. అని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలపడమే బిజెపి రహస్య ఒప్పందమా అని ప్రశ్నించారు. తక్షణం బిజెపి నోరు విప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ఈ మేరకు ఒక…

TELANGANA

వాతావరణ సమస్యను లేవనెత్తుతున్నాం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ సమస్యను భారత్ గట్టిగా లేవనెత్తుతోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వీడియో సందేశాన్ని ఆయన సోమవారం వినిపించారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం అన్ని దేశాలూ తమ స్వార్థపర ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించడం ముఖ్యమని పేర్కొన్నారు. అగ్రదేశాలు, అభివృద్ధి…

TELANGANA

తప్పిన పెను ప్రమాదం

పెనుబల్లి : పెనుబల్లి మండల కేంద్రంలో స్థానిక హెచ్‌పి గోడౌన్ సమీపంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించగా సమీపంలోని తాటి చెట్లు, వరి గడ్డి వాములు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు మోటార్ల సహాయంతో అగ్ని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అత్యంత సమీపంలోనే హెచ్‌పి గోడౌన్ ఉండటంతో గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు రెండు…

TELANGANA

అడవుల విస్తీర్ణంలో రాష్ట్రం మొదటి స్థానం: ఇంద్రకరణ్‌రెడ్డి

రాష్ట్రం అడవుల విస్తీర్ణంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని, మున్సిపల్ వ్యర్థాల శుద్దిలో అగ్రస్థానంలో ఉందని అటవీ పర్యావరణ, సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సనత్‌నగరలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రోజులకు 1082 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో 747 టన్నులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతున్నాయన్నారు. 345 టన్నుల చెత్తను మున్సిపల్ వ్యవస్థ సమర్దవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం…

TELANGANA

టీడీపీ, జనసేన పొత్తు – తొలి సీటు అభ్యర్ధి ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీతో పొత్తు దిశగా తొలి అడుగు పడింది. ఈ పొత్తుల వ్యవహారంలో సీట్ల సర్దుబాటు అంశంపైన జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్లపైన పవన్, చంద్రబాబు చర్చిస్తారని చెప్పటం ద్వారా పొత్తు ఖాయమైందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తన సీటు గురించి…

TELANGANA

భోజనానికి ముందు ఒక్కటి తింటే చాలు.. ఎన్నేళ్లు వచ్చిన యవ్వనంగా ఉంటారు..

ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే యూత్ ముఖంపై ముడుతలు వస్తున్నాయి.. దాంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అందంగా కనిపించాలని వాడని క్రీములు ఉండవు.. అలాంటి కెమికల్స్ వాడటం వల్ల ఉన్న ముడుతలు ఏమోగానీ లేనిపోని చర్మసమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.. అందుకే ఈరోజు మీకోసం న్యాచురల్ గా ఈ ముడుతలను తగ్గించే టిప్ ను తీసుకొచ్చాము.. అదేంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరికాయ గురించి అందరికి తెలుసు.. ఇవి రుచికి పుల్లగా, వగరుగా ఉంటాయి..…

TELANGANA

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పోటెత్తిన సాయం-రక్తదానానికి భారీగా క్యూలు..

ఒడిశాలోని బాలాసోర్ లో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 300 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చుట్టుపక్కన జిల్లాల్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పోటీ పడి స్ధానికులు తరలివచ్చారు. ముఖ్యంగా రక్తదానానికి స్ధానిక యువకులు భారీగా క్యూలు కట్టారు. దీంతో మానవత్వం పరిమళించింది. బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను సోషల్ మీడియాలో తెలుసుకున్న యువకులు వందల…

TELANGANA

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు.…