TELANGANA

TELANGANA

హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి,…

TELANGANA

రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదు- గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఉస్మానియా ఆస్పత్రిపై సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తుండగానే, గవర్నర్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది. ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళి సై చెప్పారు. అయితే గవర్నర్ ఉస్మానియా…

TELANGANA

పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు వంద కోట్లు ఎలా వచ్చాయ్- రఘునందర్ రావు

తెలంగాణ బీజేపీలో అగ్గిరాజుకుంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం తాను కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన…బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనన్నారు. మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు…

TELANGANA

అంతర్గత కుమ్ములాటలతో అట్టడుగుకు బీజేపీ, పుంజుకున్న కాంగ్రెస్!

తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సంఘటనలు “లాస్ట్ ది ప్లాట్” అనడానికి సరిగ్గా సరిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా, ఇప్పటివరకు అంతగా లెక్కల్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీజేపీని అధిగమించినట్లు భావిస్తున్నారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీదారుగా కాంగ్రెస్ మారిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గంలోని నేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. నేతల…

TELANGANA

రాహుల్ గాంధీ కారులో భట్టి, పార్టీలోని పరిస్థితులపై మంతనాలు!

ఖమ్మం సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సభ నిర్వహణ పైన రాహుల్ గాంధీ ఖుషీ అయ్యారని నేతలు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను భజం తట్టి అభినందించారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సభ ముగిసిన…

TELANGANA

మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్

హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు…

TELANGANA

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. జులై 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు జులై 12 వరకు పొడిగించారు. జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం తీసుకున్న చొరవతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని మత్స్యకారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు 10 శాతం మేర ఎగుమతి అవుతున్నాయి. ఇక…

TELANGANA

హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ: ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పై ఫోకస్..!

దిల్ సినిమా హీరోగా మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారా? గతంలో రాజకీయాల్లో ఉన్న ఆయన సమీప బంధువులు రాజకీయాల్లోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన నితిన్ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా? సాక్షాత్తు అమిత్ షా తో భేటీ అయిన నితిన్ అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకుంటే, అప్పుడు లేదని చెప్పి ప్రస్తుతం పాలిటిక్స్ పై దృష్టి పెట్టారా? నితిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ స్థానం…

TELANGANA

సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్; కోటిన్నర ఆర్ధికసాయం!!

తెలంగాణ రాష్ట్ర గిడ్దంగుల సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజనీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాయి చంద్ లేకున్నా రజనీకి గిడ్డంగుల…