TELANGANA

APNationalTELANGANA

ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.   కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం…

TELANGANA

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం..

తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గ్రూపు-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.   ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు…

TELANGANA

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోద ముద్ర వేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిల్లులకు ఆమోదముద్ర పడిన అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన…

TELANGANA

తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల..!15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల జాబ్స్..

తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా గత డిసెంబర్ లో దీన్ని రూపొందించింది. కొన్ని మార్పులు, చేర్పులతో ఫైనల్ చేసిన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు అమలులో ఉండనున్నది. పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారిని ప్రోత్సహించడంతోపాటు అవసరమైతే…

TELANGANA

రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం

TELANGANA

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి, నెటిజన్లకు సజ్జనార్ పిలుపు..!

యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బెట్టింగ్ భూతాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు నడుంబింగించాలని కోరారు.   బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సీరియస్   గత కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..! సభలో కీలక బిల్లులు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా సాగను న్నాయి. 19న బడ్జెట్ రానుండడంతో ఈలోగా కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆ బిల్లులు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించినవి తెలుస్తోంది. మరోవైపు విపక్షం బీఆర్ఎస్ మాత్రం జగదీష్‌రెడ్డి అంశంపై సభను స్థంభింప చేయాలని ఆలోచన చేస్తోంది.   సభలో కీలక బిల్లులు   సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి…

TELANGANA

గ్లోబల్ ఈవెంట్స్..! జైశంకర్‌తో రేవంత్ కీలక భేటీ..

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ని కోరారు.   ఈ ఏడాది హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాలైన మిస్ వ‌ర‌ల్డ్‌ పోటీలు, గ్లోబ‌ల్ డీప్ టెక్ స‌ద‌స్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు,…

TELANGANA

హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, ఐస్‌క్రీమ్స్..

హైదరాబాద్‌లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నాడు. లోయర్ దూల్‌పేటలోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీటు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయితో సంబరాలు చేసుకున్నారు.   సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, కొన్ని సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.…

TELANGANA

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇక నుండి చుక్కలే..!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటూ చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ఫాలో కావద్దన్నారు. వెంటనే అలాంటి వారిని అన్ ఫాలో చేయాలని సూచించారు. “సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అకౌంటబులిటీ అనేది ఉండాలి.…