ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పోటెత్తిన సాయం-రక్తదానానికి భారీగా క్యూలు..
ఒడిశాలోని బాలాసోర్ లో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 300 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చుట్టుపక్కన జిల్లాల్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పోటీ పడి స్ధానికులు తరలివచ్చారు. ముఖ్యంగా రక్తదానానికి స్ధానిక యువకులు భారీగా క్యూలు కట్టారు. దీంతో మానవత్వం పరిమళించింది. బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను సోషల్ మీడియాలో తెలుసుకున్న యువకులు వందల…

