TELANGANA

TELANGANA

హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం: కేటీఆర్..

హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   అధికారం కోసం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని చెబుతారని, అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని ఎద్దేవా చేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ…

TELANGANA

ఒంటిపూట బడులపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎప్పటినుండి అంటే..?

ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో, ఒంటి పూట బడుల నిర్వహణ పైన విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గతం కంటే ముందుగానే ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయాలను ఖరారు…

TELANGANA

నేడు రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ..

ఈరోజు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు…

TELANGANA

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం..

SLBC టన్నెల్ అప్డేట్ : SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం నిన్న కన్వేయర్‌ బెల్ట్‌ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. కానీ ఈరోజు కన్వేయర్ బెల్ట్ మళ్ళీ పని చేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి   దీంతో శిథిలాలు బయటకు తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది   టన్నెల్‌లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక, నిరాశతో సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్న బాధితుల కుటుంబ సభ్యులు

TELANGANA

బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం: మల్లన్న..

TG: బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీవాదం తెలంగాణలో బలపడ్డ సూచనలు కనిపిస్తున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ.. అధికార పార్టీ నేతలను వెనక్కి లాగేంత బలమైన శక్తిగా మారారని చెప్పారు. కులగణన లెక్కలు తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

TELANGANA

మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలకు సూపర్ కానుక ప్రకటించిన రేవంత్ సర్కార్..

మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలకు సూపర్ కానుక ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పం తమదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలు చెప్పారు. ఆ మాట మేరకు మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

TELANGANA

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్యే..

సైబర్ నేరస్థులు ఏకంగా ఓ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో వీడియోను కార్యకర్తలకు పంపించారు. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..   నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే ఓ అమ్మాయి న్యూడ్ గా కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్…

TELANGANA

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత..

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ వున్న ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపటి (5వ తేదీ) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని…

TELANGANA

వరంగల్ ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ అధికారులతో భేటీ..

కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోపై వరంగల్ ఎయిర్‌పోర్టుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. మామునూరు ఎయిర్‌‌పోర్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలంటూనే, నిత్యం రాకపోకలు ఉండేలా డిజైన్ రూపకల్పన చేయాలని అధికారులకు ఆయన సూచించారు.   సీఎం రేవంత్ సమావేశం వెనుక   శనివారం సాయంత్రం మామునూరు ఎయిర్‌పోర్టుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.…

TELANGANA

ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..!

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు…