మహబూబాబాద్ ఆసుపత్రిలో దారుణం: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి.. ఉదయం కదలికతో వెలుగులోకి నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో అమానుషమైన నిర్లక్ష్య ఘటన చోటుచేసుకుంది. చిన్నగూడూరు మండలం, బయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితం చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. రాజుకి తోడుగా ఎవరూ లేరనే కారణంతో, ముఖ్యంగా ఆధార్ కార్డు లేదనే సాకుతో ఆసుపత్రి సిబ్బంది అతడిని చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో రాజు రెండు రోజులు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాశాడు. సరైన వైద్య సహాయం మరియు ఆహారం…

