ఐటీ కొలువులో తీవ్ర పని ఒత్తిడి: హైదరాబాద్లో కర్ణాటక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక 32 ఏళ్ల మనుశ్రీ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొండాపూర్లోని సుమధుర అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఆమె, తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి వల్లే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మనుశ్రీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. ఆదివారం…

