TELANGANA

TELANGANA

ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలి-: కేటీఆర్..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జెండా వందనం చేసి వేడుకలు జరపాలని అన్నారు.   ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వాస్తవానికి ప్లీనరీ నిర్వహించాల్సి…

TELANGANA

కవిత కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఆవిర్భావం..;

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌)’ పేరుతో తన పార్టీని ప్రకటించి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్‌, దానిపై టీఆర్ఎస్‌…

TELANGANA

తెలంగాణకు ప్రధాని మోదీ..! మే 9న భారీ బహిరంగ సభ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో తెలంగాణ బీజేపీ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించి పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను దిగ్విజయం…

TELANGANA

కవిత కొత్త పార్టీ..! తెరవెనుక భారీ స్కెచ్..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తన తదుపరి రాజకీయ అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారా? అంటే తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. రాజకీయ పరిణామాలను గమనిస్తూనే సందర్భాను సారం గళం విప్పుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు తెరవెనుక రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల,…

TELANGANA

ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు…

TELANGANA

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్..

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి.   సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను…

TELANGANA

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది.   1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. సమస్యల…

TELANGANA

బీజేపీలోకి జీవన్ రెడ్డి..?

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బీజేపీలోకి చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.   రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.…

TELANGANA

బీజేపీ – బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కేవలం సాంకేతికపరమైన అంశాలకే పరిమితమని, అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.   కోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కానీ, దాని విచారణను కానీ తప్పుబట్టలేదని… కేవలం నివేదిక రూపకల్పనలో అనుసరించిన విధానాన్ని మాత్రమే…

TELANGANA

చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్..

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీంతో కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి RTC ఉద్యోగులు సమ్మెలోకి దిగనన్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంకోసం ప్రభుత్వం కమిటీ 4 వారాల సమయం కోరింది. దీంతో అందుకు ఆర్టీసీ జేఏసీ సంఘం అంగీకరించలేదు. కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్…