TELANGANA

TELANGANA

కుషాయిగూడలో రైతుల మహా ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి…

TELANGANA

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.   అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలిస్తారు. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తూరిపల్లికి…

TELANGANA

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం..

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు   హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని…

TELANGANA

ప్రజల్లోకి గులాబీ అధినేత కేసీఆర్..!

గులాబీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాఆశీర్వాద సభ పేరుతో మళ్లీ ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటివరకు మౌనంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరిపై మాటల తూటాలు సందిస్తారనే ఆసక్తి ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.   ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలు కానుంది. కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాలపై తనదైనశైలీలో విమర్శనాస్త్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు లేవు. తప్పులను…

APCINEMATELANGANA

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు,…

TELANGANA

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం…

TELANGANA

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాటన్ మిల్లు గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగిసిపడటంతో గోదాములో నిల్వ ఉన్న సరుకు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మ్యాట్రెస్ కంపెనీకి కూడా వ్యాపించాయి.   స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…

TELANGANA

కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ పై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రాజీకయంగా అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   “పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను ఎద్దేవా చేస్తూ,…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది.   కల్నల్ పరీక్షిత్ మెహ్రా నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణులు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం…

TELANGANA

తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తేజస్వి సూర్యపై నిప్పులు చెరిగారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని, అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని పొన్నం పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని…