TELANGANA

TELANGANA

తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్..

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై ఏమాత్రం గౌరవంలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.   బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా…

APNationalTELANGANA

ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన..

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవని, పైగా సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని నిర్దిష్ట లెక్కలతో సహా వివరించారు.   మహిళా…

TELANGANA

చర్చకు సిద్ధమా..? మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్..

సినీ గాయకురాలు మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆర్థిక మోసం వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. పరస్పర ఫిర్యాదులు, సవాళ్లతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడుల స్కామ్‌లో తన ప్రమేయం లేదని మంగ్లీ వాదిస్తుంటే, ఆమె ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని న్యాయవాది సింగపోగు సుబ్బారావు గట్టిగా వాదిస్తున్నారు. బుధవారం ఈ ఇరు పక్షాలు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.   డీజీపీ కార్యాలయం వద్ద…

TELANGANA

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కసరత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కార్యకర్తలకు త్వరలోనే శుభవార్త అందనుంది. బుధవారం సాయంత్రం సీఎంతో పార్టీ కీలక నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై సమగ్రంగా చర్చించారు.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు…

TELANGANA

ఆర్టీసీలో సమ్మె సైరన్..! 22 నుంచి సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ..

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి..22 (బుధవారం)నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు లు ఇచ్చామని ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 31 డిమాండ్లను పెట్టామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ గా మారుబోతుందా..?

బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ గా మారుబోతుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ సైతం టీఆర్ఎస్ గా ఉంటేనే ప్రజల ఆదరణ ఉంటుందని, అది పార్టీ పేరులోంచి తొలగించిన తర్వాతే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్టీ కేడర్ ఒత్తిడి, మరోవైపు రాజకీయాల్లో గడ్డుకాలం నేపథ్యంలో మళ్లీ పార్టీ మార్పు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో విజయం…

TELANGANA

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   అంగన్వాడీ టీచర్ల…

TELANGANA

అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. శనివారం నాడు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.   ఈ ఆపరేషన్‌లో భాగంగా, భూకబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం.ఏ.…

TELANGANA

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ మాసీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. తన పాత మిత్రుడిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే పంపాడు.. మీతో కలిసి పని చేయమని” అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి తన కుమారులు..…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సిద్దిపేట వేదికగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయిందని ఆయన ఆరోపించారు.   గతంలో పీసీసీ నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రులు నడుచుకునే…