TELANGANA

TELANGANA

జడ్చర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 27 మందికి గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ భారీ ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన సమయంలో బస్సులో…

TELANGANA

ఒవైసీకి బండి సంజయ్ సవాల్…..

భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు, కనీసం బురఖా ధరించిన మహిళను మీ పార్టీకి (AIMIM) అధ్యక్షురాలిని చేసే ధైర్యం మీకుందా అని ఆయన ప్రశ్నించారు. కేవలం మాటల్లో మహిళా సాధికారత అని చెప్పడం కాదు, చేతల్లో చూపాలని ‘ఎక్స్’…

TELANGANA

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు: భక్తుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న మంత్రి రాజనర్సింహ

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వైద్య ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించి, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు జాతరకు బయలుదేరినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు ప్రతి మార్గంలోనూ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా 42 ఎన్‌-రూట్ (En-route) క్యాంపులను కూడా సిద్ధం చేశారు.…

TELANGANA

విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా’ అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ (CPR) ప్రక్రియపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తే, ఆపద సమయంలో వారు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించడంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. తాను వృత్తిరీత్యా…

TELANGANA

తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయంతో మారనున్న రాజకీయ సమీకరణాలు!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య ఇప్పటికే త్రిముఖ పోరు సాగుతుండగా, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఎంట్రీతో ఈ పోటీ ఇప్పుడు చతుర్ముఖ పోరుగా మారబోతోంది. ఏపీలో కూటమి విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జనసేనాని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్…

TELANGANA

రైతులకు సంక్రాంతికి మరో తీపికబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.   సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో మరో రెండు…

TELANGANA

కరీంనగర్ కు కేంద్రం గుడ్ న్యూస్..! ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.   ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల…

TELANGANA

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

జనగామలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందని, ఆయన గనుక అసెంబ్లీలోకి అడుగుపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ‘మొనగాడు’ కేసీఆర్ అని, ఆయన సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘420 హామీల’ను నమ్మి ప్రజలు ఓటేశారని,…

TELANGANA

డ్రగ్స్ కేసు: ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసులో తన పేరును చేర్చడాన్ని నిరసిస్తూ అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, అసలు డ్రగ్స్ ముఠాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కేసులో ఇరికించారని, కాబట్టి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను తక్షణమే కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. పోలీసుల కథనం ప్రకారం, గత నెలలో…

TELANGANA

పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిది? – తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో పోలీస్ అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీపి (ACP), కమిషనర్ స్థాయి అధికారులు వారెంట్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అస్సలు పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ విజయగోపాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం…