వడ్డేపల్లిలో కవిత మార్క్ పాలిటిక్స్: ‘సింహం’ గుర్తుపై పోటీ చేసి మున్సిపాలిటీ కైవసం!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ సత్తాను చాటారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పంథాను అనుసరిస్తున్న ఆమె, తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు ఘనంగా కైవసం చేసుకున్నారు. కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.…

