పాతబస్తీ మెట్రోకు హైకోర్టు బ్రేక్: వారసత్వ కట్టడాల పరిరక్షణపై వివరణ కోరుతూ కీలక ఆదేశాలు!
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ నిర్మించే క్రమంలో అక్కడ ఉన్న పురాతన వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (PIL) కోర్టు స్పందించింది. కట్టడాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల వివరాలతో మూడు వారాల్లోగా పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని…

