TELANGANA

TELANGANA

రేవంత్ రెడ్డీ… నీకు చేతనైతే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు: హరీశ్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపరిశీలనకు వెళ్లడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన అంశాలు నిర్లక్ష్యం చేసి ఆదరాబాదరాగా ఎస్ఎల్బీసీ పనులను పరుగెత్తించారని విమర్శించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరంలోకి నెట్టారని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలు బలితీసుకుని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు.   నీకు నిజాయతీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో…

TELANGANA

కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం..

వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు.   విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ మామునూరు…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 8 మంది ఆనవాళ్ల గుర్తింపు, దారుణంగా లోపలి పరిస్థితులు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బందిని బయటికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వివరాలను మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని తెలిపారు.   టన్నెల్ వద్ద సహాయక చ్యలను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. 5-8 మీటర్ల…

TELANGANA

హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు.   నేడు గాంధీ భవన్‌లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్ట విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

TELANGANA

ఈ ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతా: సీఎం రేవంత్ రెడ్డి.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఐదు ప్రధాన అంశాలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైల్ ప్రాజెక్ట్, డ్రైపోర్ట్, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని, సెమీకండక్టర్ల ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరతపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. మూసీ ప్రాజెక్టుకు రూ.20…

TELANGANA

రేవంత్ రెడ్డి బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే అలా చేయడు: కేటీఆర్ విమర్శ..

రేవంత్ రెడ్డి బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉంటే ఎస్ఎల్‌బీసీ ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్‌పై దృష్టి సారించి ఉండేవారని, కానీ ఆయన మాత్రం ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలు అంటూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రమాదాన్ని పక్కన పెట్టి చక్కర్లు కొట్టే రేవంత్ రెడ్డికి పాలన అంటే ఏమిటో తెలుసా? అని మండిపడ్డారు.   ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు’ అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీ…

TELANGANA

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్..! బయో ఏషియా-2025 ఈవెంట్‌లో సీఎం రేవంత్..

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు ఎన్నో పని చేస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు.   మంగళవారం హైటెక్స్‌లో బయో ఏషియా-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.…

TELANGANA

పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

మూడు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుంది. దీంతో రేవంత్ సర్కార్ అటు వైపు ఫోకస్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై దృష్టి పెట్టింది. మాతృభాష తెలుగును రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా భోదించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఓ సబ్జెక్టుగా ఉండనుంది.…

TELANGANA

మేడిగడ్డ ఘటన.. కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో జిల్లా కోర్టులో కేసులో నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడిస్తూ తీర్పును ఇచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.   అయితే, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన…

TELANGANA

నేడు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌ భేటీ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.   ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత చైతన్యవంతం చేయడానికీ అవకాశం…