TELANGANA

TELANGANA

మాగంటి సునీతకు బీ ఫామ్, రూ.40 లక్షల చెక్కును అందజేసిన కేసీఆర్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఎన్నికల వ్యయం కోసం పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాగంటి సునీతతో పాటు ఆమె కుమార్తె, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.…

TELANGANA

జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభమైంది… నిజం, ధర్మం మన వైపు ఉంది: కేటీఆర్..

జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్…

TELANGANA

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే..!

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా మొదలైంది. తొలి రోజే పది మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే, ఆసక్తికరంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ మొదటి రోజు తమ నామినేషన్లను సమర్పించకపోవడం గమనార్హం.   తొలిరోజు బరిలోకి దిగిన 10 మందిలో ఇద్దరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉండగా, మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి…

TELANGANA

ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్..

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, వెల్పేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమెర్జెన్సీ ఫండ్ ను విడుదల చేశారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.10 కోట్లు చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను వినియోగించే అధికారులను సొసైటీ సెక్రటరీలకు కల్పించారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు పరిష్కారం చూపనుంది.   ఫిజికల్…

TELANGANA

రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కోయంబత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్ఠాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.   ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్…

TELANGANA

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు…

TELANGANA

తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసిన ఎన్నికల సంఘం..! ఎందుకంటే..?

తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అనూహ్యంగా బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది.   స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అనుసరించి, ఎన్నికల ప్రక్రియను…

TELANGANA

రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.   రేపు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్..

చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ఈ ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరిప్ లను విక్రియించకూడదని.. తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం జరిగింది.   ఉపశమనానికి వేసిన దగ్గు మందు చిన్నారుల ప్రాణం తీసింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు మరణాలతో కేంద్రం అలర్ట్…

TELANGANA

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ఇప్పుడు లీగల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ జీవోపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దానిని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది ఉన్నత న్యాయస్థానం.   హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్న.. హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్‌ను ప్రశ్నించింది కోర్టు. హైకోర్టులో స్టే…