TELANGANA

TELANGANA

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుందా..?

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుంది. పల్లెలు ఇందుకు వేదిక అవుతున్నాయి. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా పావులు కదుపుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక చేరింది. మండలం యూనిట్‌గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది.   రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనుంది ప్రభుత్వం. జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. ఈ ప్రాసెస్ జరిగిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల…

TELANGANA

రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు..

తెలంగాణలో వీసాల వెంకన్నగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు మొయినాబాద్ పోలీసులు. వీర రాఘవ‌రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అక్కడి నుంచి వీర రాఘవ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.   ఇదిలావుండగా వీర రాఘవరెడ్డి…

TELANGANA

దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం – కేంద్రంపై అంతా కలిసి పోరాడాలి..

మెరుగైన కుటుంబ నియంత్రణ విధానాలను అవలభిస్తున్నందుకు దక్షిణాధి రాష్ట్రాలను శిక్షిస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక అంటూ మాట్లాడుతున్న మోదీ.. ఒకే వ్య‌క్తి – ఒకే పార్టీ అనే రహస్య అజెండాతో పని చేస్తున్నారని విమర్శించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి ఆధ్వర్యంలో కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్…

TELANGANA

ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ..!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భారీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టించారు.   పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్ పూర్తవకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వాయిదాపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా…

TELANGANA

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్..

హైదరాబాద్‌లో హైడ్రా దూసుకుపోతోంది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్లి యాక్షన్ షురూ చేస్తోంది హైడ్రా టీం. అయితే బాధితుల సమస్యలు వినడానికి వెళ్ళిన హైడ్రా కమిషనర్ కు .. హైకోర్టు న్యాయవాదికి మధ్య వివాదం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   ఈ ఘటనకు సంబంధించి పవర్తి వివరాల్లోకి వెళ్తే..…

TELANGANA

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ సూచించింది. కాగా, కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించిన సమయంలో.. ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు లక్ష కార్డులను పంపిణీ…

TELANGANA

ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..

తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు.…

TELANGANA

ఈ నెల 10న కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష..

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష జరగనుంది. ఈ రైతు నిరసన దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొననున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఈ దీక్షను నిర్వహించనుంది.   రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ బూటకం: కేటీఆర్   బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి…

TELANGANA

కుల సర్వే, బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

తెలంగాణలో రాజకీయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.   కుల సర్వేను మొత్తం నాలుగు భాగాలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని…

APTELANGANA

ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సూచన..

ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంశాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.   విభజన జరిగి పదేళ్లు దాటినా పలు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ…