జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి: కాంగ్రెస్లో రేగిన దుమారంపై మంత్రి వివరణ
సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న విమర్శలు రావడంతో మంత్రి వెంటనే…

