TELANGANA

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్..

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా? శుక్రవారం సిట్ ముందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారా? ఆయన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వారిని విచారించిన కేసుకు ముగింపు ఇవ్వాలన్నది సిట్ అధికారుల ఆలోచనగా చెబుతున్నారు.   తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నత్తనడకగా సాగుతోంది. ఈ కేసు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి…

TELANGANA

హైదరాబాద్‌ రిసాలబజార్‌ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా..! డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు..,!

గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్‌‌లు, హాస్టల్స్‌‌ అడ్డాగా చేసుకొని మత్తులో ఉగుతున్న స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రిసాలబజార్‌ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్‌ టీం ఛేదించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు పెడ్లర్లతోపాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా…

TELANGANA

సినీ కార్మికుల వేతనాలు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాణ సంస్థల మధ్య కొద్దికాలంగా నలుగుతున్న వేతన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినీ కార్మికుల వేతనాల పెంపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “హైదరాబాద్ వంటి నగరంలో జీవించాలంటే కచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే” అని ఆయన…

TELANGANA

ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి: ఈసీని కోరిన బీఆర్ఎస్ ..

ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంగళవారం నాడు ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించింది.   ఈవీఎంల విశ్వసనీయతపై గత కొన్నేళ్లుగా అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, చాలా రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు…

TELANGANA

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా ఉపాసన..!

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఛైర్మన్ గా సంజీవ్ గోయెంకాను, కో-ఛైర్మన్ గా ఉపసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.   ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ… సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే…

TELANGANA

కేసీఆర్, హరీశ్ వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చు: కోమటిరెడ్డి..

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే… ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీశ్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని… కేబినెట్ సమావేశం తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తారని చెప్పారు.   సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ… రేవంత్ జూనియర్ అయినప్పటికీ…

TELANGANA

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు.. స్పందించిన కొండా సురేఖ.

తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఈ దేశ న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. కేసులు, కొట్లాటలు తనకు కొత్తేమీ కాదని అన్నారు.   తన జీవితమే ఒక పోరాటమని, ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం…

TELANGANA

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్య పోటీ..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోందని, అక్కడ టీడీపీ నేత బీటెక్ రవి భార్య పోటీ చేస్తారని వెల్లడించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   ఇక, రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. చంద్రబాబు ఓపిక పట్టడం వల్లే జగన్, ఇతర వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరగ్గలుగుతున్నారని తెలిపారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు కక్ష ఉంటే ఈపాటికే…

TELANGANA

బనకచర్ల ప్రాజెక్టు పై హరీష్ రావు సంచలన వాఖ్యలు..! ఏమన్నారంటే..?

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేశ్ మాట్లాడుతుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘మా తెలంగాణ హక్కుల సంగతి ఏమిటి’ అని ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు.   ఏదో లోపాయికారి…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ నివేదిక..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఈ రోజు ఆ నివేదిక ముఖ్యమంత్రికి చేరింది.   కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అనేక వైఫల్యాలు ఉన్నాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత…