ఈ నెల 22న చత్తీస్ గఢ్ కు మంత్రి ఉత్తమ్, సీఎం శ్రీ విష్ణుతో భేటీ.. ఎందుకంటే..?
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 22న ఛత్తీస్ గఢ్ కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సమావేశం కానున్నారు. సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళికతోపాటు పలు అంశాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం (CWC) 23న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. ఈలోగా NOC తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చత్తీస్…