జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు: ఇక రసవత్తర పోరు!
తెలంగాణలోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత, చివరికి 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం ఇదే మొదటిసారి. ఈ ఉపఎన్నికలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం 58 మందికి తుది ఆమోదం లభించింది. ఈ ఉపఎన్నికలో పోటీ…

