సిగాచీ పరిశ్రమ పేలుడు కేసు: తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
తెలంగాణలోని పాశమైలారం సిగాచీ పరిశ్రమలో ఈ ఏడాది జూన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం, 54 మంది కార్మికుల మృతికి కారణమైన ఘటనపై తెలంగాణ హైకోర్టు గురువారం (నవంబర్ 27) పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగి ఐదు నెలలు కావస్తున్నా, ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. “54 మంది కార్మికులు చనిపోయిన ఈ ప్రమాదం సాధారణ…

