TELANGANA

TELANGANA

గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

TELANGANA

హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?

800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్‌ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.…

TELANGANA

మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు..! సోదాల్లో భారీగా ఆస్తులు..

తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్‌రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు మురళీధర్‌రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ…

TELANGANA

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రెడీ.. నేటి నుండి పంపిణీ మొదలు..

దశాబ్ద తర్వాత తెలంగాణ వాసుల కల నెరవేరుతోంది. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి అంతా రెడీ అయ్యింది. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్రభుత్వం అధికారులు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రేవంత్ సర్కార్ ఒకొక్కటిగా అమలు చేస్తోంది.   తాజాగా జులై 14న అంటే సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సోమవారం నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం…

TELANGANA

తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదివరకే కొంతమందికి రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది.   ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త…

TELANGANA

మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.   మొత్తం రూ.344 కోట్లలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ రోజు (శనివారం) నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు…

TELANGANA

నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి… వైరల్ గా మారిన ట్వీట్..

ఏపీలో సంచలనం రేకెత్తించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. గతంలో కేసు విచారణకు హాజరైన విజయసాయిని సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా మారింది.   భగవద్గీతలోని”కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!” శ్లోకాన్ని ఆయన ట్వీట్ చేశారు.   “కర్మలను…

TELANGANA

హైదరాబాద్ లో మరో డ్రగ్ ముఠా గుట్టు రట్టు.. లేడీ హైహిల్స్ లో డ్రగ్స్ పెట్టుకుని సరఫరా..

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ప్రకంపనలు.. వైజాగ్‌, హైదరాబాద్‌లో డాక్టర్లే డ్రగ్స్ కొంటూ ఇంతలా దొరుకుతున్నారేంటి? ఎందరికో ఆరోగ్య పాఠాలు చెప్పే డాక్టర్లే ఇలా డ్రగ్స్ వాడ్డమేంటి? అటు వైజాగ్ ఇటు హైదరాబాద్‌లోనూ సేమ్ సీన్.. ఈ మూడు కేసుల్లోనూ డాక్టర్లే కామన్ పాయింట్. గతంలో పట్టుబడ్డ డాక్టర్లు ఎవరు? ఎలాంటి వారు? డాక్టర్లు ఎందుకిలా డ్రగ్స్ కి బానిసలవుతున్నారు? డాక్టర్లే ప్రమాదకర మాదక ద్రవ్యాలు వాడ్డమేంటి?తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఈగల్ టీం…

TELANGANA

ఆ తప్పుకు కేసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి: సీఎం రేవంత్..

కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కో తప్పుకు ఒక్కో కొరడా దెబ్బ అంటే.. కేసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాలని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లను తరలించుకుపోతే.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోతాయి.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు…

TELANGANA

నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి​ కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్‌కు పోలిక ఏంటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.…