TELANGANA

TELANGANA

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది? దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి” అని…

TELANGANA

ఆసక్తికరం.. తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు.. ఎందుకంటే..?

తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఆయన భారత పౌరుడు కాదని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆయన పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు.   ఈ మేరకు ఎన్నికల అధికారులు చెన్నమనేని రమేష్ నివాసానికి నోటీసులు అంటించారు. ఆయన పౌరసత్వం చెల్లదని, అందువల్ల ఓటరుగా కొనసాగే అర్హత లేదని…

TELANGANA

సీతక్కకు బెదిరింపు లేఖ.. మావోయిస్టుల కొత్త ట్విస్ట్..!

రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది.   వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన…

TELANGANA

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా…

TELANGANA

సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై అనుమానాలు..?

హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఘటన వెనుక మానవ తప్పిదమే కారణమా? ఆ కంపెనీ ఓనర్ హైదరాబాద్‌లో ఉన్నారా? కేవలం సెబీకి సమాచారం ఇవ్వడం వెనుక అసలు కథేంటి? ఘటన జరిగి మూడు రోజులైనా ఎందుకు స్పందించలేదు? ప్రమాదంలో ఆపరేషన్స్ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి ఉన్నారా? అందుకే మేనేజ్‌మెంట్ సైలెంట్‌గా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   హైదరాబాద్‌లోని సిగాచి పరిశమ్రలో మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీని…

TELANGANA

మేడారం సమ్మక్క సారలమ్మ డేట్స్ ఫిక్స్..!

తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ మహా జాతర.. 2026వ సంవత్సరానికి సంబంధించి.. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నట్లు జాతర పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.   2026 జాతర ప్రధాన తేదీలు: జనవరి 28 – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు ఆహ్వానం  …

TELANGANA

బీజేపీకి రాజాసింగ్ రాజీనామా..! కారణం అదేనా..?

తెలంగాణ బీజీపీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.   వివరాల్లోకి వెళితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి…

TELANGANA

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్..!

రాయలసీమకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ) నిరాకరించింది. ప్రాజెక్టుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు జారీ చేసింది.ట్రిబ్యునల్ తీర్పే ప్రధాన అడ్డంకిపోలవరం నుంచి బనకచర్ల వరకు గోదావరి జలాలను తరలించే…

TELANGANA

నెరవేరిన రైతుల కల… నిజామాబాద్ లో ‘పసుపు బోర్డు’ను ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా..

తెలంగాణ పసుపు రైతులు నాలుగు దశాబ్దాలుగా కంటున్న కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం నాడు నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.  …

TELANGANA

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై వీడిన ఉత్కంఠ.. కొత్త సారథిగా రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ, వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామచందర్‌రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్‌ను సమర్పించనున్నారు.   రాష్ట్రంలో…