World

World

కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా…

World

ఇండోనేషియాలో విషాద ఘటన

ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధికారులు…

World

తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు

హత్యానేరం రుజువైన ఒక వ్యక్తికి తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. తాలిబన్ అధికారంలోకి వచ్చిన తరువాత బహిరంగంగా మరణ శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.

NationalWorld

రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత : ప్రధాని నరేంద్ర మోదీ

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని…

World

కీలక విషయాలు వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

కొవిడ్-19.. సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. అయితే ఇంత ప్రబలంగా వ్యాపించిన కొవిడ్-19 ఎక్కడ, ఎలా పుట్టిందన్న విషయంపై ఇంత వరకు స్పష్టం రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్‍ (Wuhan Lab) లోనే ఇది తయారైందని ఇది వరకు కొన్ని అంచనాలు వచ్చాయి. మరికొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా వుహాన్ ల్యాబ్‍లో పని చేసిన ఓ అమెరికా శాస్త్రవేత్త…

NationalWorld

LUDO GAME లో తనను తానే పందెంలో పెట్టుకున్న యువతి.

ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా క్రమంగా వాటికి బానిసలుగా కూడా మారుతున్నారు. ఇక ఆ గేమ్ లలో బెట్టింగ్ ల కోసం వస్తువులు బంగారు ఇలా వేటిని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ఒక మహిళ ఒక ఆటకి బానిస అయ్యి వస్తువులకు బదులుగా బెట్టింగ్ లో తనను తానే తాకట్టు పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో…

World

ఇండోనేషియాలో బద్ధలైన సెమెరు అగ్నిపర్వతం..

ఇండోనేషియా జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో.. 1.5కి.మీల దూరం వరకు గాలిలో బూడిద వ్యాపించింది. సెమెరు అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. సెమెరు అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతం నుంచి 5కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందం. ఆదివారం తెల్లవారుజామున 2:46…

World

కెనడాలోని తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్క్ పర్మిట్

కెనడాలోని తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం కెనడాలోని వేలాది భారతీయులకు, ఇతర విదేశీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. Open Work Permit – OWP: ఉద్యోగుల కొరత కరోనా అనంతరం, కెనడాను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కెనడానే కాదు, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో తాత్కాలిక ఉపాధి…

NationalWorld

‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’

జీ 20(G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రాథమికంగా, మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. India assumes G20 presidency: అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్ జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం…

World

అఫ్గానిస్తాన్ లో భారీ పేలుడు

అఫ్గానిస్తాన్ లో బుధవారం చోటు చేసుకున్న భారీ పేలుడులో 16 మంది చనిపోయారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఉన్నఐబక్ పట్టణంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. Blast in Afghanistan మదరసాలో.. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ కు ఉత్తరంగా 200 కిమీల దూరంలో ఉన్న ఐబక్ పట్టణంలో ఉన్న అల్ జిహాద్ మదరసాలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి స్కూల్ భవనం ధ్వంసమైంది. పేలుడు కారణంగా…