APCINEMA

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణ మురళి.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali)మరోసారి కరోనా( Covid 19) బారిన పడ్డారు.

ఇటీవల పూణేలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోసాని నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలో ఆయన కుటుంబ సభ్యుల మొత్తం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం పోసాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 45 కేసులు నమోదు కాగా అందులో 18 కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. దీంతో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.