CINEMA

ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ రివీల్ చేసిన శృతి హాసన్‌.. ఇంతకీ ప్రియుడు శాంతాను ఎలా పరిచయమో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌..

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది.

 

పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్ల నుంచి శృతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తోంది. ముంబైలో ఒకే ఫ్లాట్ లో ఉంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఫస్ట్ టైమ్ శృతిహాసన్ శాంతానుతో తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో బయటపెట్టింది. ఈ అమ్మడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది.

 

ఓ నెటిజన్ శాంతానుతో ఎలా పరిచయం ఏర్పడిందని అడడగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.శాంతాను హజారికాతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు శృతి పేర్కొంది. శాంతాను ఆర్ట్ వర్క్ నచ్చి ముందు శృతి హాసన్‌నే అతని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందట. ఇక ఆ తర్వాత శాంతాను కూడా మెసెజ్‍లు చేసేవాడని, పోస్టులకు లైక్స్ కొట్టేవాడని, అలా మాట్లాడుకుంటూ ప్రేమ పడిపోయామని శృతి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పెళ్లెప్పుడు..? అని ప్రశ్నిస్తే.. అందుకు శృతి బోరింగ్ క్వశ్చన్ అంటూ సమాధానమిచ్చింది.