CINEMA

బాలకృష్ణపై సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు..

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్బిజీగా ఉన్నారు. అన్స్టాపబుల్వంటి సెలబ్రిటీ క్రేజీ టాక్షోతో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ షో ప్రసారమైన తర్వాత శభాష్ అనిపించుకుంది. ఆహా హిస్టరీలోనే అతిపెద్ద విజయవంతమైన షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది.

 

వెండితెర‌తో పాటు అటు బుల్లితెర‌ను కూడా బాలయ్య షేక్ చేసి ప‌డేస్తున్నాడు. వెండితెర‌పై మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన బాల‌య్య‌.. ఇటు బుల్లితెర‌పై దుమ్ము దులుపుతున్నాడు. గ‌త నెల‌లో భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన బాలయ్య తాజాగా యానిమ‌ల్ సినిమా టీంతో అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌ను పూర్తిచేశారు. ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

 

 

ఎపిసోడ్‌కు యానిమ‌ల్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, హీరోయిన్ ర‌ష్మిక‌తో పాటు తెలుగువాడైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా హాజ‌ర‌య్యారు. ఈ షోలో పాల్గొన్న సందీప్ రెడ్డి బాల‌య్య‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ షో చూసి తాను ఆశ్చర్యపోయాన‌ని.. బాల‌య్య పై ఎంతోమందికి ఉన్న అభిప్రాయాన్ని ఈ షో మార్చింద‌ని, అందులోనూ బాల‌కృష్ణ రణ‌బీర్ తాత‌ చేసిన సినిమా మొఘ‌ల్ ఏ అజ‌మ్ సినిమాలో డైలాగ్ చెప్ప‌డంతో ర‌ణ‌బీర్‌కే మ‌తిపోయింద‌న్నారు.

 

అస‌లు ఆ డైలాగ్ ర‌ణ‌బీర్‌కే పూర్తిగా గుర్తులేదని, అటువంటిది బాల‌కృష్ణ అంత పెద్ద డైలాగ్ ను ఎలా గుర్తు పెట్టుకున్నారా? అని తాను అవాక్కయ్యానన్నాడు. వెంట‌నే ఆయ‌న ఫ్యాన్ అయిపోయా అని సందీప్ అన్నారు. భగవంత్ కేసరితో సూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య డైరెక్టర్ బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. బాల‌య్య కెరీర్‌లో 109 వ సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది