CINEMA

మణిశర్మలా షెడ్డు కి రెడీ గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్…నెట్టింట ఎక్కువగా విమర్శలు

ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నెట్టింట ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ మధ్యన దేవిశ్రీప్రసాద్ అసలు పని పైన దృష్టి పెట్టడం లేదని ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకి ఇచ్చిన ఆల్బమ్ అయితే మహేష్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక అంత నిస్సారమైన ఆల్బమ్ మహేష్ సినిమా కెరియర్ లోనే లేదని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే ఆ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు దేవిశ్రీప్రసాద్ పేరు తలచెందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక అదే టైంలో బన్నీ తీసిన అలవైకుంఠపురం సినిమా తో పోటీపడిన సరిలేరు నీకెవ్వరు సినిమా మ్యూజిక్ పరంగా దెబ్బ వేయడంతో వీక్ అయిపోయింది. దీంతో దేవిశ్రీ పని అయిపోయింది అంటున్నారు అందరూ. ఇంకా ఆ తర్వాత పుష్పతో కాస్త ముందడుగు వేశాడు. అయితే పుష్ప కు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చిన సరే అఖండలో తమన్ కు వచ్చిన పేరైతే దేవికి రాలేదని చెప్పాలి.

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా లోని మ్యూజిక్ మహేష్ బాబుకు ఎంత దెబ్బ పడిందో ఇప్పుడు అదే దెబ్బ మెగాస్టార్ చిరంజీవికి పడబోతుందని సందేహాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య లేటెస్ట్ సాంగ్ ఒకటి విడుదల అయింది.  ఇక ఈ పాటలోని పదాలు ట్యూన్ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో జనాలు ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. బాస్ వచ్చిండు అంటూ దేవిశ్రీప్రసాద్ ఓవర్ యాక్షన్ తప్ప పాట లో దమ్ము ఏం లేదని అంటున్నారు. అలాగే గత రెండేళ్లుగా తమన్ ముందు దేవి శ్రీ ప్రసాద్ పోటీ ఇవ్వలేక పోతున్నాడని అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్ అందివచ్చిన అవకాశాలను కూడా చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు అంటూ అందరూ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ గా వచ్చిన ఫస్ట్ సాంగ్ తోనే సినిమా హిప్ మొత్తం పోయిందని అర్థమవుతుంది. మరి మిగిలిన పాటలైన మంచిగా కంపోస్ చేస్తాడా, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఇస్తాడో లేక ముంచుతాడో అన్నది వేచి చూడాలి.