CINEMA

ఒక రోజు తేడాతోనే టాలీవుడ్ స్టార్ హీరో లు ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క విడుదల తేదీని జనవరి 12వ తారీకుగా ఖరారు చేయడం జరిగింది. దాంతో ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి 13వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఒక రోజు తేడాతోనే టాలీవుడ్ స్టార్ హీరో లు ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి అనే నమ్మకం తో మైత్రి మూవీ మేకర్స్ వారు ధైర్యం చేసి విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాత అనే విషయం తెలిసిందే. మరి ఈ సంక్రాంతి పోటీ లో సక్సెస్ అయ్యేది ఎవరు అని తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. వాల్తేరు వీరయ్య సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా నుండి మరో పాట రాబోతున్నట్లుగా తెలుస్తోంది.