National

కేంద్ర బడ్జెట్ 2025-26.. రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో..

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

 

* KCC ద్వారా లోన్ల పెంపు:

కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రైతులకు అందించే లోన్ల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కీలకమైన నిర్ణయంగా భావించబడుతోంది.

 

* స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు

స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులను రూ. 30,000తో అందించనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న వ్యాపారాలకు పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది.

 

* బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం

బొమ్మల తయారీ రంగంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.

 

* ఐఐటీ పాట్నా విస్తరణ

భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ పాట్నాను విస్తరించడానికి నిధులు కేటాయించబడినట్లు ప్రకటించారు.

 

* రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణాలు

రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయాల కోసం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు.

 

* 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు

50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు, ఇది దేశంలోని వివిధ రంగాలకు కీలకంగా ఉంటుంది.

 

* గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా

గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా మరియు గుర్తింపు కార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా వారికి మరింత మద్దతు లభించనుంది.

 

* పీఎం ధన్‌ధాన్య యోజన

MSME రంగంలోని 7.5 కోట్ల మందికి సాయం అందించడానికి పీఎం ధన్‌ధాన్య యోజనను అమలు చేయనున్నారు.

 

* ప్రయోగాత్మకంగా పీఎం ‘ధన్‌ధాన్య’ యోజన

పీఎం ధన్‌ధాన్య యోజనను మొదటగా 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.

 

* మఖనా ఉత్పత్తి పెంపు

బిహార్‌లోని మఖనా రైతులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, ఉత్పత్తి పెంచేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.

 

* విద్యారంగంలో ఏఐ వినియోగం

విద్యారంగంలో ఆధునిక టెక్నాలజీలను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించడం ప్రారంభించనున్నారు.

 

* ఐఐటీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు

వచ్చే 10 సంవత్సరాలలో ఐఐటీ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

* అంగన్‌వాడీలకు కొత్త హంగులు

అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వృద్ధి కోసం నిధులు కేటాయించనున్నారు.