TELANGANA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది.

ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే
బండి సంజయ్
కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. శ్రీనివాస్ రెడ్డిని, మహేశ్వర్ రెడ్డిలను బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.

ఇక మొన్న బండి సంజయ్ వరంగల్ సీపీ రంగనాథ్ మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. తనను అరెస్ట్ చేసిన విధానంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే ఛాన్స్ కూడా ఉంది.

బండి సంజయ్ మరికొన్ని గంటల్లో .