TELANGANA

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతలు

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా నేతలు జాయిన్ అయ్యారు.

నవాబుపేట మండలం కొండాపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదర చారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న దామోదరచారి బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి బీటలు పడ్డాయి. అదే విధంగా మల్లారెడ్డిపల్లికి చెందిన (50) మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు.

 

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ దామోదర చారి సహా యువకులందరికీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దామోదర చారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంటు నినాదంతో రైతుల సంక్షేమాన్ని మరిచిందని, గత పదేళ్లుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు చేర్చిందన్నారు. ఇవాళ తాగునీటికి ఇబ్బందులు లేవని, రైతులు సుభిక్షంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరినట్లు దామోదర చారి చెప్పారు.