TELANGANA

కాంగ్రెస్ వస్తే రైతులు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్ హెచ్చరిక

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

 

Advertisement

విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్కృషి చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్నే అని దుయ్యబట్టారు. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ప్రభుత్వం కాల్చి చంపిందని చెప్పారు. వందల మందిని పొట్టన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు.

 

సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్‌ను కాంగ్రెస్ప్రభుత్వం ఎండగట్టలేదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిజాం సాగర్‌కు ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్సూచించారు.

 

కాంగ్రెస్ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారీ రాజ్యం మళ్లీ వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారు అని సీఎం కేసీఆర్వ్యాఖ్యానించారు.

 

రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్దుబారా అని రేవంత్రెడ్డి అంటున్నారు.. మరి కాంగ్రెస్గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుర్మార్గపు కాంగ్రెస్‌ను రైతులు మట్టి కరిపించాలను ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో సైతం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్తెలిపారు.