TELANGANA

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సిఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

ఆడబిడ్డల ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

 

“తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు,” అని ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు

.