తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
![](https://4news.in/wp-content/uploads/2023/12/da8efe1b6aa2f8f544de314656d87ecf.webp)