TELANGANA

ట్రాఫిక్‌ చలానాలపై మరోమారు రాయితీ

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.