TELANGANA

తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే….

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ-కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని రాష్ట్ర అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లును ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్ మున్షీ ప్రకటించారు. ఈ జాబితాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

 

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..

1. ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

2. నల్గొండ-ఉత్తమ్ కుమార్ రెడ్డి

3. కరీంనగర్-పొన్నం ప్రభాకర్

4. పెద్దపల్లి-శ్రీధర్ బాబు

5. వరంగల్-ప్రకాశ్ రెడ్డి

6. మహబూబాబాద్-నాగేశ్వర రావు

7. హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్

8. సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

9. భువనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

10. నాగర్ కర్నూల్-జూపల్లి కృష్ణారావు

11. మహబూబ్ నగర్-సంపత్ కుమార్

12. చేవెళ్ల- నరేందర్ రెడ్డి

13. మల్కాజిగిరి-మైనంపల్లి హనుమంత రావు

14. మెదక్-కొండా సురేఖ

15. నిజామాబాద్-సుదర్శన్ రెడ్డి

16. ఆదిలాబాద్-సీతక్క

17. జహీరాబాద్-దామోదర రాజ నర్సింహ